Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Andhra Pradesh చిత్తూరు పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

చిత్తూరు పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

by Prakash
High Tension In Chittoor Punganur

తిరుపతి, High Tension In Chittoor Punganur

చిత్తూరు(Chittoor) పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. రాత్రి సదుం మండలం ఎర్రతివారిపల్లెలో బీసీవై పార్టీ బోడె రామచంద్ర యాదవ్ కాన్వాయ్ లో 10 వాహనాలను ధ్వంసం. రాళ్లు రువ్వి, కట్టెలతో దాడులు చేసిన దుండగులు. సదుం పోలీస్ స్టేషన్ ముందే ప్రచార రథాన్ని తగలబెట్టిన దుండగులు. సదుం మండలంలో వైసీపీ బీసీవై పార్టీ. మధ్యన కొనసాగుతున్న గొడవలు.

ఇవాళ గొడవలు జరిగిన ప్రాంతాలలో పర్యటించనున్న డీఐజీ అమ్మిరెడ్డి | DIG Ammireddy..

రాత్రి నుంచి సదుం మండలంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు.

బీసీవై పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకుండానే తన అనుచరులతో దాడి చేస్తున్నారు పెద్దిరెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బోడె రామచంద్ర యాదవ్.

మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు, వైసిపి కార్యకర్తలే తమ వాహనాలు ధ్వంసం చేశారని బోడె రామచంద్ర యాదవ్ ఆగ్రహం, అవేదన.

ఓటమి భయంతోనే…

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి భయంతోనే పుంగనూరులో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్. పుంగనూరు లోని గ్రామాలలో ప్రశాంత వాతావరణంలో ప్రచారం చేసుకుంటూ ఉండగా తమ అనుచరులతో తనపై, తన అనుచరుల పై దాడి చేయించి వాహనాలను ధ్వంసం చేయించి ప్రచార రథాలకు నిప్పు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు బోడె రామచంద్ర యాదవ్. గత ఐదు సంవత్సరాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత కూడా పెద్దిరెడ్డి ఆగడాలు ఆగలేదని పోలీస్ స్టేషన్ ముందే తన ప్రచార రథాన్ని తగులబెట్టినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు అని ఆరోపించారు బోడే. దాదాపు 30 మందికి పైగా తన అనుచరులకు గాయాలయ్యాయని, వారందరూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, పదుల సంఖ్యలో వాహనాలను ధ్వంసం చేసి ప్రచార రథాలకు నిప్పంటించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోవు ఎన్నికలలో పుంగనూరు ప్రజలు ఇవన్నీ గమనించి ఓట్లు వేయాలని అభ్యర్థించారు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్. నిన్న జరిగిన గొడవల కారణంగా ఇరువర్గాలపై పోలీసులు 307 కేసులను నమోదు చేశారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.
    మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం కేంద్రంగా ఆదివాసీలు తమ గళాన్ని వినిపించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (ఏహెచ్‌పీఎస్) తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆదివాసీ పోరుకేక’ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుండి వేలాది మంది ఆదివాసీలు…
  • ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.
    తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.…
  • అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం
    మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను…
Advertisements

You may also like

Our Visitor

020384
Total views : 92844

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.