458
అనంతపురం జిల్లా గుత్తి మండలం టీ కొత్తపల్లి గ్రామంలో టిడిపి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గుంతకల్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం గెలుపొందడంతో టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యంలో కొందరు వైసిపి శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడి ద్విచక్ర వాహనాన్ని అడ్డు పెట్టడంతో గొడవ ప్రారంభమైంది. టిడిపి, వైసిపి వర్గీయుల పరస్పరం ఒకరిపై ఒకరు కట్టెలతో దాడి చేసుకొని గాయాల పాలయ్యారు.గాయపడిన ఇరుపార్టీ వ్యక్తులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు






Total views : 90702