Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Political ప్రభుత్వ వైద్యశాలను MlA ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మిక తనిఖీ..

ప్రభుత్వ వైద్యశాలను MlA ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మిక తనిఖీ..

by Rama
ప్రభుత్వ వైద్యశాలను MlA ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మిక తనిఖీ..

యాంకర్ పార్ట్: ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతోపాటు డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ రోగులకు వాహన సౌకర్యం ఏర్పాటు చేసి వారి స్వగ్రామాలకు చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలు సక్రమంగా లేకపోవడంపై ఆసుపత్రి సూపరిండెంట్ అబ్దుల్ కలాం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని క్లీన్ గా ఉంచాలని, రోగులకు శుభ్రతతో కూడిన భోజనాన్ని అందించాలని ఆదేశించారు. మరొకసారి తాను ఆసుపత్రికి తనిఖీకి వచ్చేసరికి ఆసుపత్రిలో సౌకర్యాలు అన్ని మెరుగుపడాలని లేకుంటే సంబంధిత అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి హెచ్చరించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014710
Total views : 80912

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.