Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Political ప్రభుత్వ వైద్యశాలను MlA ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మిక తనిఖీ..

ప్రభుత్వ వైద్యశాలను MlA ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మిక తనిఖీ..

by Rama
ప్రభుత్వ వైద్యశాలను MlA ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మిక తనిఖీ..

యాంకర్ పార్ట్: ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతోపాటు డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ రోగులకు వాహన సౌకర్యం ఏర్పాటు చేసి వారి స్వగ్రామాలకు చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలు సక్రమంగా లేకపోవడంపై ఆసుపత్రి సూపరిండెంట్ అబ్దుల్ కలాం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని క్లీన్ గా ఉంచాలని, రోగులకు శుభ్రతతో కూడిన భోజనాన్ని అందించాలని ఆదేశించారు. మరొకసారి తాను ఆసుపత్రికి తనిఖీకి వచ్చేసరికి ఆసుపత్రిలో సౌకర్యాలు అన్ని మెరుగుపడాలని లేకుంటే సంబంధిత అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి హెచ్చరించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
    వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
    రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
  • యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
    హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
  • ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.
    ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039664
Total views : 199089

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: