206
అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో భారీ సంఖ్యలో చేపలు మృతి చెంది సముద్ర తీరం వెంట కొట్టుకురావడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. టన్నుల కొద్దీ చేపలు చనిపోవడంతో జీవనాధారాన్ని కోల్పోతామంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేపల మృతికి గల కారణాలను గుర్తించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు.