Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh సీఎం హోదాలో చంద్రబాబు తొలి పర్యటన..! 

సీఎం హోదాలో చంద్రబాబు తొలి పర్యటన..! 

by Satya
CM Chandrababu

ఏపీ నూతన సీఎం చంద్రబాబు(CM Chandrababu) క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి పర్యటనగా రేపు పోలవరం వెళుతున్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ప్రతి సోమవారం నాడు పోలవరం పర్యటన గానీ, పోలవరంకు సంబంధించి సమీక్ష గానీ జరిగేవి. ఇప్పుడు కూడా అదే ఆనవాయతీ కొనసాగించాలని నిర్ణయించారు. రేపు సోమవారం ఉదయం 9.30 సీఎం చంద్రబాబు పోలవరం చేరుకోనున్నారు. ప్రాజెక్టులోని అన్ని విభాగాలను పరిశీలించి, పోలవర ప్రాజెక్టు అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను మళ్లీ పరుగులు తీయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం…
    అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఏడీసీ అధికారులు,…
  • ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తర్వాత మారిన బీజేపీ రాజకీయం …
    తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చ జోరందుకుంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. పశ్చిమ బెంగాల్ తరహాలోనే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయమని…
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత..
    గంజాయి తరలిస్తున్న ముఠాను సికింద్రాబాద్ జీఆర్పీ,ఆర్పీఎఫ్ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి పద్దెనిమది లక్షలకు పైగా విలువైన 36 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

018675
Total views : 89152

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.