తిరుపతి లీలామహల్ వద్దగల PS4 హోటల్ లో నిన్న ఓ భక్తుని ఆహారంలో జర్రి రావడం చూసి ఆందోళనతో హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడం,వారు అతనిని బిల్లు కట్టి వెళ్లాలి అంటూ హుకుం జారీ చేయటంతో గోడవ కాస్తా బయటకు పొక్కింది.అటు తరువాత నిద్రమత్తులో ఉన్న ఆరోగ్య శాఖ అధికారులు మేల్కొని హోటల్ సీజ్ చేయడం జరిగింది.తిరుపతి లోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ (FSO) నిర్లక్ష్యం కారణంగా కొన్ని హోటల్స్ ఫుడ్ సేఫ్టీ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు మంగళం పాడేసారన్నారు తిరుపతి బిజేపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి.తిరుపతి జాయింట్ కలెక్టర్ ఆధీనంలో పనిచేస్తున్న ఇద్దరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO) లు ప్రతినిత్యం తనిఖీలు చేయకపోవడం బాధ్యతారాహిత్యం అని అలాగే నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు నెలలో కనీసం రెండుసార్లు అయినా నగరంలోని హోటల్స్,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తనిఖీలు చేసిన దాఖలాలు లేవన్నారు.తిరుపతి హోటల్స్ పై పర్యవేక్షణ తూతూ మంత్రమే?తమ సిబ్బంది చేత ప్రతినిత్యం నగరంలోని హోటల్స్ ను తనిఖీలు చేయించాలని నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలనన్నారు.తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్,ఆరోగ్యశాఖ అధికారుల తీరు చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా హడావిడిగా హోటల్ సీజ్ చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిందన్నారు.ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక నగరం కొంత మంది అవినీతి అధికారుల కారణంగా పవిత్రత,పరపతి మంట కలుస్తున్నదని,పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులతో పాటు స్థానికులకు నగరంలోని కొన్ని హోటల్స్ నాసిరకం పదార్థాలు విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం దుర్మార్గమన్నారు.తిరుపతిలో అధికారికంగా సుమారు 300 హోటల్స్ ఉంటాయని అనధికారికంగా ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయని పర్యవేక్షించాల్సిన అధికారులే నెల మామూళ్ల మత్తులో మునిగిపోతున్నారన్నారని ఆరోపించారు.తిరుపతిలోని హోటళ్లను నెలలో కనీసం రెండు మూడు సార్లు అయినా తనిఖీలు చేయకపోవడంతో నాసిరకం ముడి సరుకులతో నాణ్యతలేని రీసైక్లింగ్ వంట నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలను రెండు మూడు రోజులు ఫ్రిజ్ లో పెట్టి తిరిగి కస్టమర్స్ కి అందించడంతో అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో ప్రతినిత్యం నగరంలోని అన్ని తరహా హోటల్స్ లో ముమ్మర తనిఖీలు చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించలేని హోటల్స్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని భక్తుల,స్థానికుల తరఫున నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- మాజీ సీఎం జగన్కు మంత్రి నారా లోకేష్ సవాల్.తాడేపల్లి ప్యాలెస్కు సమీపం నుంచి జగన్కు సవాల్ విసిరారు మంత్రి లోకేష్. డీఎస్సీపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. ‘‘జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా. గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లి పారిపోయే రకం కాదన్నారు.…
- చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో భారీ మైలురాయిని అందుకుంది. 400 కోట్ల గ్రాస్ మార్క్ను అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ రూరల్…
- ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మురికి కాలువలు, అంతర్గత రోడ్లు, గాంధీ పార్క్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే…
- అభిమాని నిరంజన్ను పరామర్శించిన పవన్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు. స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ అనే బాలుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. తనచివరి కోరిక అభిమాన నటుడైన పవన్ కల్యాణ్ ను కలవడమేనని చెప్పడంతో.. ఆ బాలుడిని చూసేందుకు పవన్…
- ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో జరిగిన కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. దర్శకుడు హరి హారన్.వి తన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 147057