నేపాల్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. రెండు బస్సుల్లో కలిపి 63 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో ముగ్గురు బయటపడగా, మిగతా 60 మంది నీటిలో గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు. నదిలో గల్లంతైన ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు త్రిశూలి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.నదికి రెండువైపులా కొండలు ఉండగా.. ఓ కొండను ఆనుకుని నారాయణ్ ఘాట్ – మగ్లింగ్ రోడ్ ఉంటుంది. బస్సులు ఈ రోడ్ పై వెళుతుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బస్సులు అదుపుతప్పి నదిలో పడ్డాయని అధికారులు వివరించారు. ఈ ప్రమాదం గురించిన సమాచారం అందగానే పోలీసులు, సైన్యం స్పందించాయని, సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు. బోట్లతో త్రిశూల్ నదిలో గాలిస్తున్నారు.అయితే, వరద ఎక్కువగా ఉండడంతో గాలింపు కష్టంగా మారిందని తెలిపారు. కాగా, కొండచరియల కారణంగా నారాయణ్ ఘాట్ – మగ్లింగ్ రోడ్ ప్రస్తుతం బ్లాక్ అయిందని స్థానిక ఎస్పీ భవేష్ రిమాల్ తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి