150
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు న్యూఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తల్లి వెంటే ఆస్పత్రిలో ఉన్నారు. సోనియాగాంధీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని..ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు వైద్యులు. ఢిల్లీలో వాతావరణ మార్పులతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఆస్పత్రిలో చేర్చినట్టు సమాచారం. ఐతే జనవరిలోనూ అస్వస్థతకు గురైన సోనియా గాంధీ అప్పుడు కూడా గంగారామ్ ఆస్పత్రిలోనే చికిత్స పొందారు.




Total views : 77703