44
హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాల అంశంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ల నుంచి వచ్చిన వారికి నగరంలో ఓటరు కార్డులు, రేషన్ కార్డులు, బ్యాంకు ఖాతాలు ఉన్నాయని ఆరోపించారు. రామ్కోఠిలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను పరిశీలించిన అనంతరం చిన్నారులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసిన కిషన్రెడ్డి, ఖైరతాబాద్ మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. పాతబస్తీలో బీఎల్వోలను మజ్లిస్ నేతలు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుకోలేరని స్పష్టం చేశారు.






Total views : 180172