ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనకు ముందే.. జిల్లా కాంగ్రెస్లో ఫ్లెక్సీల రాజకీయం సెగలు రేపుతోంది. సీఎం సభ కోసం నగరమంతా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్స్, స్వాగత ఫ్లెక్సీలలో.. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఫొటో కనిపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. జిల్లా కాంగ్రెస్లో చాలా కాలంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గానికి, డీసీసీ అధ్యక్షుడికి మధ్య సమన్వయ లోపం ఉందనే ప్రచారం జరుగుతోంది. తాజా ఫ్లెక్సీల వ్యవహారం ఈ అంతర్గత విభేదాల చర్చకు మరింత ఊతమిచ్చింది. ప్రోటోకాల్ ప్రకారం జిల్లా అధ్యక్షుడికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కొందరు నేతలు డిమాండ్ చేస్తుంటే.. దీనిని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదని మరో వర్గం కొట్టిపారేస్తోంది. అయితే, నేడు జరగబోయే సీఎం బహిరంగ సభ వేదికపై డీసీసీ అధ్యక్షుడికి ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుంది? ఈ విభేదాల చర్చకు సీఎం పర్యటనతో బ్రేక్ పడుతుందా? లేదా అసమ్మతి మరింత పెరుగుతుందా? అన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
నేడు నల్గొండలో సీఎం రేవంత్ పర్యటన.
71
previous post






Total views : 180166