మహిళా రైతులు వ్యవసాయ.. ఇతర అనుబంధ కార్యక్రమాలు అభివృద్ధి చేసుకొనుటకు అవసరమైన వ్యవసాయ ట్రాక్టర్, పనిముట్లప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సదరు వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయడం , వారిని ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించేలా ప్రోత్సహించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు ఎమ్మెల్యే. మహిళా రైతులకు శ్రమను తగ్గించి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పాదకతను సాధించేలా ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కేవలం పంటల సాగుకే పరిమితం కాకుండా, డైరీ, పౌల్ట్రీ వంటి అనుబంధ రంగాలలో కూడా మహిళలు రాణించేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నారు.
వ్యవసాయ ట్రాక్టర్, పనిముట్లప్రారంభోత్సవ కార్యక్రమం.
43



Total views : 221432