ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జ్షీట్తో ఓ ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో సీఐడీ జరిపిన లోతైన విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్సార్సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ను నటి కాదంబరి జెత్వాని బ్లాక్మెయిల్ చేసినట్లు సీఐడీ తన చార్జ్షీట్లో అధికారికంగా పేర్కొంది. సీఐడీ చార్జ్షీట్ ప్రకారం.. కుక్కల విద్యాసాగర్తో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలకు సంబంధించిన ఫొటోలను చూపించి కాదంబరి జెత్వాని ఆయనను బెదిరింపులకు గురిచేసింది. ఈ ఫొటోలను బయటపెడతానంటూ బ్లాక్మెయిల్ చేసి, విద్యాసాగర్ నుంచి ఆమె రూ. 1.32 కోట్లు వసూలు చేసినట్లు సీఐడీ స్పష్టం చేసింది. ఈ బ్లాక్మెయిలింగ్, డబ్బు వసూళ్లకు సంబంధించిన పక్కా ఆధారాలను కూడా సీఐడీ తన చార్జ్షీట్లో పొందుపరిచింది. గతంలో ఈ కేసు రాజకీయంగా, పరిపాలనాపరంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. జెత్వాని ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, ఈ కేసులో విచారణ సరిగా జరపలేదనే ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. అయితే, ఇప్పుడు సీఐడీ సమర్పించిన చార్జ్షీట్లో విద్యాసాగర్ను జెత్వాని బ్లాక్మెయిల్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలతో పేర్కొనడంతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ సంచలనాలకు దారితీస్తుందో చూడాలి.
సినీ నటి జాత్వని కేసులో సీఐడి ట్విస్ట్.
37
previous post



Total views : 221442