Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh ప్రకాశం జిల్లా గిద్దలూరు లో వైసీపీ కి కోలుకోలేని దెబ్బ..

ప్రకాశం జిల్లా గిద్దలూరు లో వైసీపీ కి కోలుకోలేని దెబ్బ..

by Prakash
Prakasam District


ప్రకాశం జిల్లా (Prakasam District) :

వైసీపీకి గుడ్ బై చెప్పిన కాపు సంఘం ముఖ్య నేతలు..

ప్రకాశం జిల్లా (Prakasam District) గిద్దలూరు వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. నియోజకవర్గ కాపు సంఘం ముఖ్య నాయకులంతా మూకుమ్మడిగా అధికార వైసీపీకి గుడ్ బై చెబుతూ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. గిద్దలూరు పట్టణంలోని ఒంగోలు రోడ్డులో గంగాభవాని కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి, మరియు ఒంగోలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి గార్ల సమక్షంలో నియోజకవర్గ కాపు సంఘం కీలక నేత, కాపు సంఘం మాజీ అధ్యక్షులు యల్లా శ్రీనివాసులు, మరియు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి పసుపులేటి శ్రీనివాసులు గార్ల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని కాపు సంఘం ముఖ్య నాయకులు, 400 కాపు కుటుంబాలతో సహా అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. వైసిపిని వీడిన వారందరికీ టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికలతో గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీల కూటమి బలం మరింత పెరిగిందని రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక మెజార్టీ తథ్యమన్నారు.

మాగుంట, ముత్తుముల సమక్షంలో టీడీపీలో భారీగా చేరిన కాపు నాయకులు..

ఈ కార్యక్రమంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన కాపు నాయకులు రాస బాలుడు, సూరె కొండయ్య, C.I కొండయ్య, గోనుగుండ్ల బాల నరసయ్య, యల్లా శివ ప్రసాద్, యల్లా కోటయ్య, యల్లా క్రిష్ణ, యల్లా సుబ్బారాయుడు, యల్లా శివరంగస్వామి, యగటిల రంగస్వామి, యగటిల రంగ నాయకులు, B నెమలి గుండం, ముద్దర్ల వెంకటేశ్వర్లు, తంబూరి నాగయ్య, పోరుమామిళ్ల వెంకట సుబ్బయ్య, జొన్నలగడ్డ వెంకట రమణ, షేక్ రఫీ, షేక్ నూరుల్ల, వంగిటి నవీన్, మాలపాటి సత్యం, D రమణ, V.తిరుపతయ్య, V. మల్లి, S.ఖాదర్ వలి, బెట్టి శ్రీను, అనురాజుల చంటి, లింగయ్య, పార్శ రంగస్వామి, పార్శ రామ లింగస్వామి, మోడీగిరి యర్రన్న, తదితరులు పాల్గోన్నారు.

ఇది చదవండి : ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం..


మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా …
పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం …
కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..
డాక్టర్..బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014546
Total views : 80447

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.