Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Latest News జగిత్యాల ఆర్టీసీ బస్టాండ్ లో మహిళ వద్ద నగలు చోరీ..

జగిత్యాల ఆర్టీసీ బస్టాండ్ లో మహిళ వద్ద నగలు చోరీ..

by Prakash
Jewelery stolen from woman in Jagityala RTC bus stand..

జగిత్యాల కొత్త బస్టాండ్ లో ఈ రోజు మధ్యాహ్నం ఓ మహిళ వద్ద బ్యాగ్ లో ఉన్న 15 తులాల బంగారు నగలు అపహరణకు గురైన ఘటన చోటుచేసుకుంది. మెట్ పల్లి పట్టణంలో వెల్లుల్ల రోడ్ కి చెందిన కి చెందిన సురిగి మంగరాణి తన కూతురుతో బీర్పూర్ మం. లో జరిగిన ఒక శుభకార్యానికి హాజరై తిరుగు ప్రయాణంలో జగిత్యాల కొత్త బస్టాండ్ లో మెట్ పల్లి బస్సు కోసం నిరీక్షిస్తుంది. ఈ క్రమంలో నగలు అపహరణకు గురైనట్లు గుర్తించిన బాధితురాలు వెంటనే జగిత్యాల టౌన్ పోలీసులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న జగిత్యాల టౌన్ సిఐ వేణుగోపాల్, ఎస్ ఐ నరేష్ లు జగిత్యాల కొత్త బస్టాండ్ కు చేరుకుని బస్ స్టాండ్ లోని కంట్రోల్ రూమ్ లోని సీసీ టివి ఫుటేజ్ లను పరిశీలించారు. అనంతరం బాధితురాలి నుండి ఫిర్యాదు స్వీకరించి జగిత్యాల టౌన్ సి ఐ వేణుగోపాల్ దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisements

You may also like

Our Visitor

019391
Total views : 90659

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.