Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh ఆనంద్ బాబు కీలక వ్యాఖ్యలు

ఆనంద్ బాబు కీలక వ్యాఖ్యలు

by Satya
Anand Babu

సిఎం జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా తరిమి కొట్టడానికి ప్రజాగళాన్ని నిర్వహించబోతున్నామని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. పార్వతీపురం పట్టణంలో టిడిపి ఇన్ ఛార్జ్ బోనాల విజయచంద్ర నివాసంలో నక్కా మీడియాతో మాట్లాడారు. యువగళం పాదయాత్రలో పార్వతీపురం నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. లోకేష్ యువగళం పాదయాత్ర ఆపేందుకు ఎన్నో అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. రెండు నెలలు పాదయాత్రను ఆపగలిగారు కానీ ప్రజల్లో ఉన్న స్పందనను మాత్రం ఆపలేకపోయారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు పై అక్రమ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆత్మసంతృప్తి పొందారని విమర్శించారు. ఎన్నికలు త్వరలో వస్తున్నందున ఇచ్చాపురం వరకు సాగవలసిన పాదయాత్రను విశాఖపట్నంలోనే ముగిస్తున్నామని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. అనంతరం అంగన్వాడీలు చేస్తున్న ధర్నాకు మద్ధతుగా దీక్షా శిబిరం వద్దకు వెళ్లి నక్కా ఆనంద్ బాబు సంఘీభావం తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

014718
Total views : 80935

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.