కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీనివాస లాడ్జి లో వ్యక్తి ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం మండూరు నివాసి అట్లూరి గోపాలకృష్ణగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు వల్ల అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. హనుమాన్ జంక్షన్ పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
Krishana
వైకాపా నాయకులు అవినీతి అక్రమాకేసులు ఎదుర్కొంటూ దెయ్యాలు వేదాలు వర్లిచ్చినట్టు ఉంది వైకాపా నేతల తీరు బిజెపి అధ్యక్షులు పరందేశ్వరిపై వైకాపా నాయకుల విమర్శలు పై ఆమె స్పందించారు. జగన్ వైకాపా పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ పెట్టింది పేరు అని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఇసుక అటవీ సంపదను దోచుకుంటున్నారని తెలిపారు. కరెంట్ బిల్లు చెత్త మున్సిపల్ పన్నులు వేసి ప్రజలను నడ్డి విరుస్తున్నారు. వైకాపా నాయకులు ఇద్దరు A 1. A 2 జగన్మోహన్ రెడ్డి విజయ సాయి రెడ్డిని ఉద్దేశించి 10 సంవత్సరాల నుంచి తాత్కాలిక బెయిల్ పై ఉండటం ఎక్కడా లేదు అని తెలిపారు. ఇలాంటి అవినీతిపరులు విజయ్ సాయి రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి మీరా మా అధ్యక్షురాలు న విమర్శిస్తారా.. రాష్ట్రంలో జరిగిన మీ అవినీతిని ఆధారాలతో బయట పెట్టినందుకు మా అధ్యక్షులను విమర్శిస్తారని తెలుపుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి గారి ఆదేశాలతో రాష్ట్రంలో బిజెపి అధికారంలో వచ్చే అంతవరకు ప్రజా సమస్యలపై పోరాడుదాం తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ కంటి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స పూర్తయింది. ఆసుపత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ ను నిర్వహించారు. ఈ ఆపరేషన్ దాదాపు 2 గంటల సేపు కొనసాగింది. శస్త్ర చికిత్స ముగిసిన వెంటనే ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లారు చంద్రబాబు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ ఆభిమానులు ఆసుపత్రికి వచ్చారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జగ్గయ్యపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాం, ఇన్చార్జి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య NTR జిల్లా జగ్గయ్యపేట మండలం లోని పత్తి, మిర్చి, వరి తదితర పంటల సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్న టీడిపి నేతలు విత్తనం దగ్గర నుంచి ఎరువులు, మందులు, నాట్లు, కలుపులు తీసి వరికి 40వేలు, పత్తికి 50వేలు, మిర్చికి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టి చివరకు సాగునీరు అందక నానా ఇబ్బందులు పడుతున్న రైతులను ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోని ప్రభుత్వం, ప్రకృతి వైపరీత్యాల క్రింద నిధిని ఏర్పాటు చేస్తామని, పంటల భీమా పథకాన్ని కల్పిస్తామని ఎన్నికల ముందు వాగ్దానం విస్మరించి కనీసం రైతులకు సాగునీరు అందించలేని, ఈ ప్రభుత్వం విధానాలను ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురామ్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య రైతు సంఘం నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి జగ్గయ్యపేట మండలంలో రెడ్డి నాయక్ తండా, అన్నవరం గ్రామాలలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలన. నెట్టెం శ్రీ రఘురాం మాట్లాడుతూ రైతుల ఆందోళనను వైయస్సార్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. రెడ్డినాయక్ తండాలో 40 సంవత్సరాల క్రితం ఉన్న స్కీం పట్టించుకోకుండా సాగునీరు అందకపోవడం వల్ల జగ్గయ్యపేట మండలంలో సుమారు వరి 200 ఎకరాల్లో మిరప 150 ఎకరాల సుమారు పంట ఎండిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇంకా ఇతర పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. మోటర్లు పెట్టి సాగునీరు పంట పొలాలకు ఇవ్వాలన్నా సరిపడా కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో వైసిపి ప్రభుత్వం ఉంది. మొన్న క్యాబినెట్ సమావేశంలో కనీసం రైతుల గురించి ఆలోచించని జగన్ ప్రభుత్వం రైతులను కల్లబొల్లి మాటలతో మోసం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వారి తాబేదారులకు లంచం చేకూర్చడంలో ఉన్న ఉత్సాహంలో 10% అయినా రైతులుపై పెట్టాలి. జగ్గయ్యపేట మండలంలో జరిగిన పంట నష్టాన్ని అధికారులు వెంటనే సర్వే చేసి వారికి పంట నష్టం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తాతయ్య మాట్లాడుతూ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల రైతులకు కంట కన్నీరు మిగిలింది. మిర్చి, వరికి రైతులు పెట్టుబడి పెట్టి నీరంధక నష్టపోయారన్నారు. చంద్రబాబు నాయుడు హాయంలో ముక్త్యాల స్కీమ్ శంకుస్థాపన చేసి రైతులకు సాగునీరు అందించాలని కృషి చేస్తే, ఈ ప్రభుత్వం స్కీం స్థలాన్ని వేదాద్రి కి మార్చి పనులు ఆపు వేయడం వల్ల రైతులు సాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వంలో కంచెల-వేదాద్రి స్కీం ఆగిపోవడం జరిగింది. బూదవాడలో నెట్టెం రఘురాం హాయంలో స్కీమ్ ఏర్పాటు చేశారు. నిధులు లేవని వంకచూపి వైసిపి ప్రభుత్వం స్కీం ఆపివేయడం జరిగిందన్నారు. నిర్లక్ష్యం, సరైన ఆలోచన లేకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టం చవిచూస్తున్నారు. జగ్గయ్యపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను పూర్తిగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్.
ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది. ఈ ప్రభావంతో నవంబర్ 8 న ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని కారణంగా ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారి.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయంటున్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు, మబ్బు వాతావరణం ఉంటుంది అంటున్నారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు, మబ్బుగా ఉంటుందని వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. నమ్మకద్రోహం పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉందని దుయ్యబట్టారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా పురంధేశ్వరి మారారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలై ఉండీ టీడీపీకి సేవ చేస్తున్నారని దుయ్యబట్టారు. పురంధేశ్వరి, ఆమె భర్త చంద్రబాబు పల్లకీ మోస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణకు చెందిన ‘అన్న టీడీపీ’కి కొంత కాలం గౌరవ అధ్యక్షురాలిగా ఉండి ఆ పార్టీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యాక కాంగ్రెస్లో చేరారంటూ మండిపడ్డారు.
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి.. పురంధేశ్వరి అంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకో వైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికమని సాయిరెడ్డి అన్నారు. తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం అంటకాగిందని ఆరోపించారు.
నాగాయలంక మండల శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సమితి నూతన కమిటీ ఎంపిక ఆత్మీయ సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేమాల వారి పాలెం శ్రీ ఆంజనేయ స్వామివారికి దర్శించుకుని పూజలు నిర్వహించి అనంతరం వంతెన వద్ద నుంచి నాగాయలంక ప్రధాన రహదారుల వెంట భారీ ర్యాలీతో శ్రీ ప్రసన్న గణపతి స్వామిని దర్శించుకుని మరిపాలెం వంతెన సెంట్రల్ వరకు కాపు సోదరుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి రంగా విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. వెంకటేశ్వరరావు రైస్ మిల్లు వద్ద సహపంక్తి భోజనాలు నిర్వహించారు.
అక్రమ మద్యం పై ఉక్కు పాదం మోపుతున్న ఏసీపీ జనార్దన్ నాయుడు సిఐ హనీష్ నందిగామ బైపాస్ రోడ్డు సమీపంలో సీఐ హనీష్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు కారులో తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని నందిగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నందిగామ మండలం చందాపురం సమీపంలో
చందర్లపాడు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్ద లక్ష రూపాయలు విలువచేసే 528 క్వార్టర్ బాటిల్ షిఫ్ట్ కారు సీజ్ చేసామని సిఐ హనీష్ తెలిపారు అక్రమంగా తెలంగాణ మద్యం ఆంధ్రలోకి తీసుకుని వచ్చి అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హనీష్ తెలిపారు తనిఖీలలో ఎస్ఐ పండు దొర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు అనగా 4-11-23 వ తేదీ శనివారం మరియు రేపు అనగా 5-11-23 వ తేదీ ఆదివారం రెండు రోజులు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బూతు స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ఓటర్ల నమోదు చేర్పులు మార్పులు తొలగింపులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా జిల్లా కలెక్టర్ కోరారు.
డాక్టర్ నార్లతాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదంలో కార్మికుడు దుర్మరణం…. డాక్టర్ ఎన్టీటిపిఎస్ లోని కోల్ ప్లాంట్ లో ప్రమాదం చోటుచేసుకుంది. స్టేజ్ 1&2లో క్యాజువల్ లేబర్ గా పనిచేస్తున్న శౌరీ ప్రమాదవశాత్తు కోల్ బెల్టు పై పడటంతో ఈప్రమాదం జరిగింది. వేరే స్టేజ్ లో పనిచేస్తున్న శౌరీని స్టేజ్ 1&2లోకి మార్చడం వల్లనే ఈప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారు.




Total views : 194132