కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో భారతదేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి బుద్ద ప్రసాద్ మాట్లాడుతూ జహార్ లాల్ నెహ్రూ భారతదేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఆయన జన్మదినం రోజున బాలల దినోత్సవం జరుపుకుంటాం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమాలకు విచ్చేసిన చిన్నారులు, పాఠశాల విద్యార్థులతో ముచ్చటించి ఆనందంగా గడిపారు. అనంతరం జహార్ లాల్ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
Krishana
కార్తీక మాస పర్వదినాలు ప్రారంభం కావడంతో మొదటి రోజైన మంగళవారం కార్తీక మాసం శోభ సంతరించుకుంది.. అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ, ఘంటసాల ,మోపిదేవి, చల్లపల్లి మండలాలలోని వేకు జాము నుంచే అదిక సంఖ్యలోమహిళలు కృష్ణా నదిలో ప్రత్యేక పుణ్య స్థానాలు ఆచరించి నదీ తీరాన ఉన్నటువంటి శివాలయాలలో ప్రత్యేక పూజలు చేసి శివుని దర్శించుకున్నారు.. నాగాయలంక శ్రీ రామ పాదక్షేత్రం పుష్కర ఘాట్లో కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు పవిత్ర స్నానం ఆచరించి నది ఒడ్డునఉన్న రామలింగేశ్వర స్వామిని అభిషేకించారు. కార్తీకదీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండలం కోడూరుపాడు లో బాణాసంచా పేలి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయ పడిన వారిని విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గుట్టు చప్పుడు కాకుండా ఒక ఇంట్లో ఉల్లిపాయ బాంబులు అనుమతులు లేకుండా తయారుచేస్తున్న వైనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరవల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
జిల్లా వైసీపీ నాయకులు, వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాశ్ జన్మదిన వేడుకలు అయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు… వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, స్థానిక కార్పొరేటర్ లు మరియు అభిమానులు వేడుకల్లో పాల్గొని జయ ప్రకాష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు.. ఈ సందర్బంగా అవినాష్ మాట్లాడుతూ.. ” నా శ్రేయస్సు కోరుకునే ప్రధమ వ్యక్తుల్లో జయప్రకాశ్ ఒకడు, ఆయన చేసే సేవా కార్యక్రమాలు అన్ని నా శ్రేయస్సు కోసమే అని కొనియాడారు “…. జయప్రకాష్ మాట్లాడుతూ ” పుట్టినరోజులు చేసుకోవడం తన అభిమతం కాదని, ఈ నెపంతో పదిమందికి సహాయం చేయొచ్చు అనే ఉద్దేశంతోనే పుట్టినరోజు నిర్వహించుకుంటానని తెలియజేశారు… ఈ సందర్భంగా పేదలకు తోపుడు బండ్లు మరియు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు…
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరుతారు. అజాద్ జయంతి సందర్భంగా మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే నిర్వహిస్తున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. జగన్ పర్యటన సందర్భంగా విజయవాడలో భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో జగనన్న కు చెబుదాం కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఆర్డీవో సాయిబాబా పాల్గొన్నారు. మండల స్థాయి ఫిర్యాదుల పరిష్కారం కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. పలువురు తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అర్జీలు ఆన్లైన్ చేసి రసీదు ఇచ్చి సమస్యను కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకెళ్తున్నారు. నందిగామ మండలం పెద్దవరం రైతులు కంచికచర్ల మండలంలో కొత్తపేట గ్రామానికి చెందిన రైతులు తమ సమస్యను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ద్వారా జాయింట్ కలెక్టర్ కు తెలియజేశారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్న జాయింట్ కలెక్టర్.
కృష్ణాజిల్లా.. అవనిగడ్డ నియోజకవర్గం.. ఉల్లిపాలెం శ్రీమన్నారాయణస్వామి వారి దేవాలయలంలో నగలు చోరీ.. ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ ఆలయంలో గురువారం అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. దొంగలు ఆలయ ప్రధాన ద్వారాల తాళాలు పగలు కొట్టారు. రాజ్యలక్ష్మి, గోదాదేవి అమ్మవారి ఉపాలయాల్లో విలువైన బంగారం వెండి ఆభరణాలు చోరీ చేశారు. అమ్మవార్లకు పూజలకు వినియోగించే వెండి పాత్రలు, దేవేరుల మంగళ సూత్రాలు అపహరణకు గురైనట్లు సమాచారం. సమాచారం తేలుసుకున్న, ఎస్సై వి. రాజేంద్రప్రసాద్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి పరిశీలించి, దేవస్థానం అర్చకులను, గ్రామస్తులను వివరాలను చేపట్టారు.
కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు ,అవనిగడ్డ డివిజన్ డి.ఎస్.పి మురళీధర్ పరివేక్షణలో కోడూరు మండలం మందపాకల గ్రామ రెవెన్యూ పరిధిలోని రొయ్యలు సాగు చెరువులు వద్ద పేకాట నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను కోడూరు ఎస్సై వి రాజేంద్రప్రసాద్ తన సిబ్బందితో మెరుపు దాడి చేశారు..
సంఘటన లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారు వద్ద నుంచి 61 800 నగదు స్వాధీనం చేసుకున్నట్లు అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ రమేష్ తెలిపారు .ఈ సందర్భంగా సిఐ ఎల్ రమేష్ మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా అసంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులకు తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ పోలీసు అధికారులకు తెలియజేస్తే వారి నెంబర్లు గోపియ్యం, ఉంచుతామన్నారు .ఆసంఘీక కార్యక్రమాలు పాల్పడినవారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు…అదేవిధంగా దీపావళి పండగ పర్వదినాన పురస్కరించుకుని అనుమతులు లేకుండా ముందుగండి సామాగ్రి గాని తమ గృహాల వద్ద గాని తన షాపుల్లో గాని ఉంచితే వెంటనే తమకు ఎటువంటి సమాచారం వచ్చినా వెంటనే ఆకస్మికంగా సాపులను తనిఖీలు చేసి అట్టి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు అనుగుణంగానే ముందుకుండి సామాగ్రిని అమ్మకాలు చేపట్టాలని సూచించారు .ఈ సమావేశంలో తనకు ఎస్సైవి.రాజేంద్రప్రసాద్ పోలీస్ సిబ్బంది ఉన్నారు…
టిడిపి , జనసేన రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం విజయవాడ నోవాటెల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి తరఫున నారా లోకేష్, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు , జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. రెండు పార్టీలు కలిసి భవిష్యత్ కార్యాచరణ పై మూడు గంటలు సుదీర్ఘంగా చర్చించారు. టిడిపి జనసేన పార్టీలవైపు సుమారు మూడు కోట్ల మంది ప్రజలు చూస్తున్నారని వారందరిని పలకరిస్తూ రెండు పార్టీలు కలిసి భవిష్యత్ గ్యారెంటీ అనే నినాదంతో ప్రతి ఇంటికి వెళ్లి టిడిపి జనసేన మేనిఫెస్టో, కరపత్రాలను అందిస్తామంటున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు పేస్ టూ ఫేస్..
చంద్రబాబు నాయుడును ఎదుర్కోలేక రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు ఆధారాలు లేని తప్పుడు కేసులు పెడుతున్నాయి.. చంద్రబాబు క్షేమంగా బయటికి రావాలి కొన్ని కోట్ల మంది ప్రజలు దేవుళ్లను మొక్కుకున్నారు. త్వరలోనే చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరల ముఖ్యమంత్రి అవుతారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు ఆపిల్ చేసిన క్వాష్ పిటిషన్ తీర్పు ఈరోజు రేపో వెలువడనుంది. 17a గురించి సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. చట్టాలను ఉల్లంఘించడం సీఎం జగన్కు వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి ప్రజలకు దూరం చేయాలనీ చూస్తున్నాను.
Read Also..





Total views : 194247