అనకాపల్లి జిల్లా, కంటతడి పెట్టుకున్న మంత్రి గుడివాడ అమర్ నాథ్. నాకు టిక్కెట్ దక్కలేదని కొన్ని పత్రికలు ఛానళ్ళు రాస్తున్నాయి. అమర్ పనైపోయింది అంటు ప్రచారం చేస్తున్నారు. చిన్న వయస్సు నుండే కష్టాలు చూసిన వాడిని ఇలాంటి వార్తలు వల్ల నేను దిగజారిపోను. అన్నింటికంటే పెద్ద పదవి ఒకటి ఉంది అది వైసీపీ కార్యకర్త పోస్టు అది ఉంటే చాలు ఇంకేమి అవసరం లేదు. మీతో పాటు కార్యకర్త గా జెండా మోయడానికి సిద్దం ఉన్నా. వీధివీధుల్లో కార్యకర్త గా తిరుగుతా. రాష్ట్రవ్యాప్తంగా ఓ ముఠా తయారైంది. వైసీపీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డాం అధికారం వచ్చాక కొంత మందికే పదవులు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు అలాంటి వాళ్ళు పార్టీలో ఉండటం కంటే వెళ్లడమే మంచిది. నా రాజకీయ జీవితం సంతృప్తిగా ఉంది. గతంలో చంద్రబాబు కొడుకు అనుభవించిన పదవి నాకు జగన్ ఇచ్చారు. కార్పోరేటర్ గా ఎమ్మెల్యేగా మంత్రి పని చేసా అది చాలు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు భరత్ కు సహకరించాలి.
Vishakapattanam
విశాఖ జిల్లా పెందుర్తిలో వెలుగులోకి పోలీస్ దాష్టికాలు. స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే మహిళపై లాఠీ తో కసాయితత్వం చాటుకున్న ASI మురారి. ASI మురారి పేరు చేబితేనే బయబ్రాంతులకు గురౌతున్న చిరువ్యాపారులు ఐ యాం పోలీస్ తాట తీస్తా అంటూ చిరువ్యాపారులపై బండబూతులు. ASI వేధింపులతో తీవ్ర మనస్థాపానికి గురైన బాధిత మహిళ. గాయాల బాధను తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ, మహిళతో పాటు పలువురిపై విచక్షణ రహితంగా లాఠీచార్జి చేసిన ASI మురారి. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళన.
అల్లూరి సీతారామరాజు జిల్లా, వైసీపీ అరకులోయ నియోజకవర్గం సమన్వయకర్తగా ప్రస్తుత అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని నియమించడంతో అరకులోయ లో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు. ఎంపీ మాధవి బిసి కి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుందని, ఎస్టి కాదని, ఎస్టీకి చెందిన స్థానికేతరుడు కు అరకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని వైసీపీ శ్రేణులు ర్యాలీ, మానవహారం.
అనకాపల్లి జిల్లాలో మందు తాగి రెచ్చిపోయిన విద్యార్థులు. బాలుర వసతి గృహంలో వెలుగులోకి 7వ తరగతి విద్యార్థుల బాగోతం. చోడవరం బిసి బాలుర వసతి గృహంలో మితి మీరిన న్యూ ఇయర్ సెలబ్రేషన్. మద్యం మత్తులో చిందులేసిన మైనర్ విద్యార్థులు. మందలించిన హాస్టల్ ముందు ఉంటున్న AC మెకానిక్. తప్పు అని మందలించిన వ్యక్తిపై విద్యార్థులు మూకుమ్మడి దాడి. పత్తాలేని హాస్టల్ వార్డెన్. చోద్యం చూస్తున్న చోడవరం పోలీసులు.
అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ను ముట్టడించిన ప్రజలు. పని చేయాలంటే లంచం అడుగుతున్న ఎలక్ట్రికల్ ఏ.ఈ. ఎం.నాగేశ్వరరావు. వినియోగదారుల నుండి అధిక మొత్తంలో లంచం డిమాండ్ చేస్తున్న ఏ.ఈ. మీటర్ గురించి అప్లై చేసిన వినియోగదారుడు ను 40వేలు రూపాయలు లంచం డిమాండ్ చేశాడంటూ ప్రజల ఆరోపణ. ఎక్కడికి వెళ్లినా నన్ను ఏమి చేయలేరని ఏ.ఈ. నాగేశ్వరరావు ధైర్యం. సబ్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ప్రజలు.
నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఓ యువతి, ఓ యువకుడిని ప్రేమించింది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం యువకుడు ఆమెను మాట్లాడుకుందామని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ హోటల్ గదిలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ వీరిద్దరూ శారీరకంగా కలిసిన తర్వాత, యువకుడు అతని ఫ్రెండ్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో యువకుని స్నేహితుడు అక్కడికి చేరుకొని, యువతిని బెదిరించి బలవంతంగా అత్యాచారం చేశాడు. తాను ప్రేమించిన ప్రియుడే, అతని స్నేహితుడితో అత్యాచారం చేయించడంతో తీవ్ర మనస్థాపనకు గురైన ఆ యువతి ఆర్కే బీచ్ కి చేరుకొని విలపించడం ప్రారంభించింది. అదే బీచ్ లో సందర్శకులకు ఫోటోలు తీసే ఓ ఫోటోగ్రాఫర్, ఆమెను గమనించి ఓదార్చినట్టు నటించి నేనున్నానంటూ నమ్మించి స్నేహితుల గదికి తీసుకువెళ్లాడు. మొత్తం తొమ్మిది మంది కలిపి యువతిపై గ్యాంగ్ రేప్ చేయడంతో యువతి బెదిరిపోయి వేరే ఊరికి వెళ్ళిపోవడం జరిగింది. యువతి తల్లిదండ్రులు భయపడి ఇంటికి రాకపోవడంతో యువతీ ఫోర్ టౌన్ పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంతో యువతని పోలీసులు చేదించి పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ విషయాలన్నీ పోలీసులకు తెలియడంతో దీనికి కారణమైన వాళ్లందర్నీ అరెస్ట్ చేయడం జరిగింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తూహిన్ సిన్హా మీడియా సమేశం ఏర్పాటు చేసారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023 సంవత్సరం లో గంజాయి సంబంధించి పోలీసు మరియు సబ్ కలిసి మొత్తం 266 కేసులు నమోదుచేసి అందులో 21785.29 కేజీలు గంజాయిని మరియు 16775 కేజీలు యాసిష్ ఆయిల్ని సీజ్ చేసి 859 నిందుతులను అరెస్ట్ చేశామని 248.94 ఎకరాలలో 11,68,100 ల గంజాయి మొక్కలను ధ్వంసం చేశామని అదే విధంగా 10290.5 ఎకరాల లో ప్రత్యామ్నాయ పంటలను రైతులకు కల్పించామని అయిన తెలిపారు. మావోయిస్టు లీడర్లని, 21 మిలిసియా సభ్యులను అరెస్ట్ చేయడం జరిగిందని 18 మంది మావోయిస్టు కోరిర్స్ మీద బైండ్ ఓవర్ కేసులను నమోదు చేశామని 7 మంది మావోయిస్టులు మరియు 3 మంది మిలిసియా సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారని, అలాగే 2 చోట్ల మావోయిస్టు యొక్క డంబు లని రికవరీ చేయడం జరిగిందని తెలియజేసారు. క్రైం రేటు 9 శాతం తగ్గినదని సారా, మరియు అక్రమ మద్యం దారుల పై 675 కేసులు నమోదు చేసి 738 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 11,422 లీటర్ల సారాయి సీజ్ చేసి 1,71,620 లీటర్ల పులుపు ను ధ్వంసం చేశామని మీడియా సమావేశంలో ఎస్పీ తూహిన్ సిన్హా తెలిపారు.
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం.. గంగవరం పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడ్డతీగల సీఐ వై రాంబాబు మాట్లాడుతూ.. అడ్డతీగల నుండి రాజమండ్రి వైపు అక్రమంగా ట్రాక్టర్లో తరలిస్తున్న 320 కిలోల గంజాయిని, 5గురు వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నట్లు సిఐ y.రాంబాబు తెలిపారు. ఒక ద్విచక్ర వాహనంతో పైలట్గా వెళుతూ ట్రాక్టర్లో రవాణా సాగిస్తున్నారని గంగవరం ఎస్సై రామకృష్ణకు అందిన విశ్వనీయ సమాచారం మేరకు గంగవరం శివారులో వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా ట్రాక్టర్ పై అనుమానం రావడంతో తనిఖీ చేయగా గంజాయి బస్తాలను, ఐదుగురు వ్యక్తులను అదుపులోనికి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. జి జిఅన్న (పైలట్గా ), పెద్దింట్ల తిరుమలరావు ( డ్రైవర్), మండోది గణేష్, దళాయి రాజు, ముర్ల బాలరాజు అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
అనకాపల్లి జిల్లాలో అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనకాపల్లిలో చోటుచేసుకుంది. రాత్రి ఓ అపార్ట్మెంట్లో పురుగుల మందు తాగి భర్త, భార్యతో సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మరో 9 ఏళ్ల పాప కుసుమ ప్రియ ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. చికిత్స పొందుతున్న కుసుమ ప్రియా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే కొడవలి రామకృష్ణ తన భార్య మాధవి దేవి వారి పిల్లలు వేద వైష్ణవి, జాన్వి లక్ష్మి, కుసుమ ప్రియ తో కలిసి గత కొంతకాలంగా స్థానిక ఫుడ్ పేట, ఫైర్ స్టేషన్ పక్కన లక్ష్మీ పారడైస్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నట్లుగా అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ సీఐ దాడి మోహన్ రావు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గుంటూరు తెనాలికి చెందిన రామకృష్ణ కుటుంబం రాత్రి అన్నంలో పురుగులు మందు కలుపుకొని మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని మంగళగిరిలో ఉంటున్న రామకృష్ణ బంధువులకి సీఐ సమాచారం చేరవేశారు. మృతులు భర్త కొడవలి రామకృష్ణ, భార్య మాధవి దేవి, పిల్లలు వేద వైష్ణవి, జాన్వి లక్ష్మిగా పోలీసులు గుర్తించారు.
విజయనగరం జిల్లా,
స్నేహితులతో కలిసి అరకు విహారయాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డ యువకుడు. కొత్తవలస – అరకు ప్రధాన రహదారిలో నిమ్మలపాలెం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం జిల్లా మింది గ్రామానికి చెందిన యువకుడు తేజ (23) మృతి చెందాడు. స్నేహితులతో కలిసి అరకు విహారయాత్రను ముగించుకొని తిరిగి వస్తుండగా నిమ్మలపాలెం గ్రామం వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న వ్యానును బలంగా ఢీకొనడం వల్ల సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు ప్రయాణం చేస్తున్న మరొక యువకుడు భాను తీవ్రంగా గాయపడటంతో 108 అంబులెన్స్ లో పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.





Total views : 92778