పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు పాడేరు విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ ముట్టడించి, ఉద్యోగులు బయటకు రాకుండా దిగ్బంధించారు. విద్యుత్ సబ్ స్టేషన్ ప్రధాన గేట్లను మూసివేసి, ప్లెక్సీలు కట్టి ధర్నాకు దిగారు. భారతీయ జనతా పార్టీ నేతలు.. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిజేపి ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరు ఈ.పి.డి.సి.ఎల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్ చార్జీల భారంతో వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో మరింతగా ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
Vishakapattanam
లంచం తీసుకుంటున్న హెడ్ కానిస్టేబుల్ ను ఏసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. విశాఖ జిల్లా గాజువాకలో ఎట్టకేలకు సొంత శాఖపై ఏసిబి పంజా విసిరింది. గొడవల కేసులో ఐదువేల రూపాయల లంచం తీసుకుంటున్న గాజువాక హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్ ను ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా విశాఖ పోలీసు శాఖ ఉలిక్కిపడింది.
Read Also..
Read Also..
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు చింతపల్లి పర్యటన నేపథ్యంలో హెలిపాడ్, సభాప్రాంగణము, విద్యార్థులకు ట్యాబ్లులు పంపీణీ చెసె పాఠశాలను జిల్లా కలక్టరు సుమిత్ కుమార్, ఎమ్ ఎల్ ఎ భాగ్యలక్షి పరీశీలించి అధికారులుకు తగు సుాచనలు చేసారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఎర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి సుమారు 30 వేల మంది జనబా హాజకానున్నారని , ఈ రోజు విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కూడా చేస్తారని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. చౌడుపల్లిలో హెలికాప్టర్ దిగడానికి హెలిపాడ్, చింతపల్లిలో సభ స్థలం అధికారులు పూర్తి చేశారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
టిడిపి ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. జనవరి 27వ తేదిన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర రాష్ట్రంలో 226 రోజులపాటు 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3132 కిలోమీటర్లు సాగింది. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గంలో యాత్ర ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు యాత్ర సాగించాలని ముందుగా టిడిపి భావించింది. ఈ ప్రకారం వచ్చే జనవరిలో శ్రీకాకుళం జిల్లాలో ముగించాల్సి ఉంది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో సెప్టెంబర్ 9వ తేదితో యాత్ర నిలిచిన విషయం తెలిసిందే. చంద్రబాబు బెయిల్పై వచ్చిన తరువాత నవంబర్ 27 నుంచి తిరిగి ప్రారంభించారు. సుమారు 80 రోజుల పాటు యాత్ర సాగలేదు. మరోపక్క ఎన్నికల సమయం దగ్గర పడటంతో యాత్రను వీలైనంత త్వరగా ముగించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రవేశించకుండానే యాత్ర ముగియనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో ఇబ్బందులు పడుతున్న సకలజనుల గొంతుకను అవుతానని లోకేష్ యాత్ర ప్రారంభానికి ముందు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రతి సభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని అధికార పార్టీ నేతలపై విమర్శల దాడి చేశారు. అదేవిధంగా యాత్రలో పలు సమస్యలపై అధికార యంత్రాంగానికి 600పైగా లేఖలు రాశారు. పాదయాత్ర పూర్తయిన ప్రతి వంద కిలోమీటర్ల ప్రాంతంలో అక్కడి ఉన్న సమస్యను అధికారంలోకి రాగనే పూర్తిచేస్తానని శిలఫలాకలతో లోకేష్ హామీ ఇచ్చారు. 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో లోకేష్ పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. భారీ స్థాయిలో ముగింపు సభ, యువగళం విజయోత్సవ సభను టిడిపి భారీస్థాయిలో నిర్వహించనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ నెల 20వ తేది విజయోత్సవ సభను జరపనుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు వస్తారని అంచనా వేసింది. చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపూర్, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ఏడు ప్రత్యేక రైళ్లను టిడిపి సిద్ధం చేసింది. ఈ సభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.
అల్లూరి సీతారామ జిల్లా చింతపల్లి మండలం లంబసింగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో చాలీచాలని రూములతో ఇబ్బందులు పడుతున్న ఆశ్రమ పాఠశాల విద్యార్థినీలు. ప్రస్తుతం 320 మంది విద్యార్థినిలు ఇరుకైన చిన్న రూములలో చదువుకోవడం మరలా బెంచిలి తీసి పడుకోవడం కొంతమంది విద్యార్థినిలు రూములు చాలక బయట గ్రౌండ్లో నేలపై చదువుకోవడం జరుగుతుంది, గత తెలుగు దేశం ప్రభుత్వం హైములో స్కూల్ బిల్డింగ్ మంజూరు చేసారు అది పునాదిలు తీసి పిల్లరస్ కట్టి వదిలేసారు అక్కడ గోతుల్లో నీరునిల్వ ఉండి పోయి దోమలు విపరీతంగా పెరిగి పోయి రోగాలు బారిన పడి అవకాశం ఉందని ఆ గ్రామ పెద్దలు వద్యార్థి తల్లి తండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాడు నేడు పనులతో అన్ని స్కూళ్లను రూపుమారుస్తున్నారు కానీ లంబసింగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు ఆ భాగ్యం లేదని ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు తెలియపరిచిన వారి విద్యార్థినిలు సమస్య సమస్యలుగా మిగిలిపోయిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు కిముడి లక్ష్మయ్య అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థినిలు కనీస అవసరతలు తీర్చాలని విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖపట్నం జగదాంబ సెంటర్ లో ఉన్న ఇండస్ హాస్పిటల్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెండు, మూడో ఫ్లోర్ నుంచి వచ్చిన పొగ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. ఫైర్, పోలీస్ మరియు ఆసుపత్రి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పేషెంట్లని బయటకు పంపిన నేపథ్యంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు భారీ క్రేన్లతో అందించిన సహాయ సహకారాలు వల్ల పెను ప్రమాదం తప్పింది.
జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలోని నొవాటెల్ హోటల్ వద్ద ఆందోళన చేస్తున్న మనోహర్ ను, ఇతర జనసేన నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో అక్కడి నుంచి తరలించారు. టైకూన్ కూడలిలో రోడ్డు మూసివేతను నిరసిస్తూ మనోహర్ నేతృత్వంలో జనసేన ధర్నా చేసింది. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా నిర్మిస్తున్న కట్టడానికి వాస్తు బాగోలేదని రోడ్డును మూసేశారని ఈ సందర్భంగా మనోహర్ మండిపడ్డారు. వైసీపీ నేతల నిర్మాణాలకు వాస్తు దోషం ఉంటే రోడ్లను మూసేస్తారా అంటూ ప్రశ్నించారు. తమ ధర్నా రాజకీయ కార్యక్రమం కాదని శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమమని మనోహర్ చెప్పారు. తమ ధర్నా కార్యక్రమం గురించి తెలిసి నిన్నటి నుంచి పోలీసులు పలు విధాలుగా తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. తమ వాళ్లను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారని అన్నారు. వైసీపీ నేతల ట్రాప్ లో పోలీసు అధికారులు పడొద్దని సూచించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శించారు.
శ్రీ నాదెండ్ల మనోహర్ గారి అరెస్టు అప్రజాస్వామికమని, ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా? శ్రీ మనోహర్ గారితోపాటు, ఇతర నేతలను విడుదల చేయకపోతే విశాఖ వస్తా… పోరాడతా అని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ ను మూసివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే నిరసన తెలిపి, ఆ కూడలిని తెరవాలని కోరినందుకు మా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రజలకున్న సమస్యలను తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీస్ అధికారులు ఇందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏమిటి? ఆయన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషం ఉందని రోడ్డు మూసి వేయడం ఏమిటి? ఈ విషయాలను ప్రజా గొంతుకగా జనసేన వినిపిస్తోంది. అందులో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలని శ్రీ మనోహర్ గారి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమైతే పోలీసులు ప్రవర్తించిన తీరుని ఖండిస్తున్నానని అన్నారు. శ్రీ మనోహర్ గారిని, ఇతర నేతలను తక్షణమే విడుదల చేయాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. ఇదే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే విశాఖపట్నం బయలుదేరి వస్తానని ప్రజల కోసం, ప్రజల తరఫున పోరాడతానని ఆయన అన్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యువగళం పాదయాత్ర చివరి రోజుకు చేరుకుంది. ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లా లో ప్రవేశించనుంది. 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తోండంగి మండలం తేటగుంట వద్ద ఫైలొన్ ఆవిష్కరించారు. 3000 కిలోమీటర్ల మైలురాయిని దాటిన సందర్భంగా లోకేష్ తో పాటు నారా బ్రహ్మణి, దేవాన్ష్, టీడీపీ జిల్లా ముఖ్యనేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. యువగళం పాదయాత్ర ముగింపు సభ ముగ్గురు మహనేతల సమన్వయంతో విజన్ తో ఉండబోతోందని అంటున్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తో తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి సూరిబాబు మరింత సమాచారం అందిస్తారు.
Read Also..
చింతూరు ఏజెన్సీ లో కలకలం రేపిన జంట హత్య కేసులో నిందితులను పట్టుకున్న పోలీసులు తన భార్య తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని శ్రీకాంత్ అనే వ్యక్తిని తన భార్య ప్రియాంకని హత్య చేసిన భర్త నాగేంద్ర. అక్రమ సంబంధంతో పాటు ఆర్థిక లావాదేవీల విషయంలో తగాదాలున్నాయని పథకం ప్రకారం హత్య చేసిన నిందితులు. A1 నాగేంద్ర A2 మినప శ్రీనుకి మృతుడు శ్రీకాంత్ డబ్బులిచ్చి అడగడం విషయంలో గొడవలు.
వివరాల్లోకి వెళితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు శ్రీకాంత్ ,అది నాగేంద్ర, మినప శ్రీను స్నేహితులు అని శ్రీకాంత్ దగ్గర A1, A2 లు కొంత నగదు తీసుకున్నారు. శ్రీకాంత్ A1 గా ఉన్న నాగేంద్ర కు డబ్బులిచ్చి తనతో స్నేహంగా ఉంటు భార్యతో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నడని శ్రీకాంత్ కి మినప శ్రీను, నాగేంద్రలకు డబ్బులిచ్చి తిరిగి అడగడం విషయంలో విభేదాలు వచ్చాయి. డబ్బులు విషయంలో వచ్చిన తగాదాలు తన భార్యతో సన్నిహితంగా ఉండే విషయం లో శ్రీకాంత్ పై పగ పెంచుకుని పక్క ప్లాన్ ప్రకారం A2 గా ఉన్న మినప శ్రీను ఇంట్లో నాగేంద్ర భార్యతో శ్రీకాంత్ సన్నిహితంగా ఉన్న విషయం మినప శ్రీను ఫోన్ ద్వారా నాగేంద్రకు చెప్పాడు. నాగేంద్ర భార్య శ్రీకాంత్ లు కలిసి ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళిన నాగేంద్ర విచక్షణ కోల్పోయి కోపోద్రిక్తుడై పక్కనే ఉన్న ఇనుప రాడ్డు తో బలంగా తలపై కొట్టడంతో శ్రీకాంత్ అక్కడిక్కడే మరణించగా నాగేంద్ర భార్యను కొన ఊపిరితో చింతూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్లగా చికిత్స పొందుతూ మరణించిందని మృతుడు శ్రీకాంత్ తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు విచారణ చేసి నిందితులను పక్క రాష్ట్రానికి పారిపోతుండగా చట్టి జంక్షన్ వద్ద పట్టుకున్నమని చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గజేంద్ర కుమార్ తెలిపారు.




Total views : 92854