61
అల్లూరి జిల్లా అరకులోయలో గిరిజన యువత క్రీడా ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో నూతన వాలీబాల్ కోర్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అరకు ఎంపీ గుమ్మ తనుజారాణి మాట్లాడుతూ గిరిజన యువతలో అపారమైన క్రీడా నైపుణ్యం ఉందని, సరైన అవకాశాలు కల్పిస్తే జాతీయ స్థాయిలో రాణించగలరని అన్నారు. రాజ్యసభ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి తన ఎంపీ నిధుల నుంచి రూ.30 లక్షలు మంజూరు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కోర్టును సద్వినియోగం చేసుకుని గిరిజన క్రీడాకారులు ఉన్నత విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, అభిమానులు పాల్గొన్నారు.





Total views : 180158