49
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 56 మంది బాధితులకు రూ. 50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అందజేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో గత రెండేళ్ల కాలంలోనే సుమారు నాలుగున్నర కోట్ల రూపాయల భారీ ఆర్థిక సాయాన్ని పేదలకు అందించామని గుర్తుచేశారు. నిధుల కొరత ఉన్నా ఎక్కడా సాయం ఆగకుండా సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని మంత్రి కొనియాడారు.






Total views : 180323