58
రాజమండ్రిలో పర్యటిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. 2027 పుష్కరాల నేపథ్యంలో ఏర్పాట్లపై ఫోకస్ పెట్టిన పవన్కల్యాణ్..పుష్కర ఘాట్లను పరిశీలించారు. పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణిస్తూ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పవన్కు అభివృద్ధి పనుల గురించి వివరించారు. అనంతరం పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రానున్న పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించాలనే యోచనలో ఉన్న డిప్యూటీ సీఎం..ఈ మేరకు అధికారులకు సూచనలు చేశారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసేలా దిశానిర్దేశం చేశారు.




Total views : 90650