హరియాణాలో ప్రశాంతంగా కొనసాగుతున్నఅసెంబ్లీ ఎన్నికల పోలింగ్. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ డబుల్ పతకాలు సాధించిన స్టార్ షూటర్ మను బాకర్ ..ఝజ్జర్లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబంతో కలిసి ఓటేసింది. ఎన్నికల్లో తాను ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదే తొలిసారి అని బాకర్ తెలిపింది. చిన్న అడుగులే పెద్ద లక్ష్యాలను చేరుకుంటాయని.. దేశ యువతగా ఓటు వేయడం మనందరి బాధ్యతని మను బాకర్… యువతకు పిలుపునిచ్చింది.
కర్నాల్లో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. చర్కి దాద్రిలోని పోలింగ్ కేంద్రంలో మాజీ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగాట్ ఓటు వేశారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కురుక్షేత్రలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. హరియాణా ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి నాయబ్ సింగ్ సైనీ అంబాలాలో ఓటు వేశారు. రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామంటూ విశ్వాసం వ్యక్తంచేశారు. ఫరీదాబాద్లో కేంద్రమంత్రి కృషణ్ పాల్ గుర్జార్, సిర్సాలో మాజీ ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌటాలా ఓటుహక్కు వినియోగించుకున్నారు. భారత సంపన్న మహిళ, స్వతంత్ర అభ్యర్థి సావిత్రి జిందాల్ హిస్సార్లో ఓటు వేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చిందన్న టీఎన్ఎస్ఎఫ్.గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ‘ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దుతోందని టీఎన్ఎస్ఎఫ్ పేర్కొంది . విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కూటమి విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రౌండ్…
- నటి రమా నందన కుటుంబంపై ఇబ్రహీంపట్నంలో కేసు.ప్రముఖ యూట్యూబర్ మన శంకర వర ప్రసాద్, నటి రమా నందన అలియాస్ నందు కుటుంబంపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మోసం కేసు నమోదైంది. యూకే వీసా రెన్యూవల్ చేస్తామంటూ డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట ఓ బాధితుడికి రూ. 15 లక్షల…
- వికారాబాద్ జిల్లా, యాలాల్ మండలం, కోకట్ గ్రామ సమీపంలో విషాదం.వికారాబాద్ జిల్లా యాలాల్ విహారయాత్ర కోసం వెళ్లిన కుటుంబంలో విషాదం నెలకొంది. సరదాగా ఈత కోట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు నీటమునిగారు. ఈ క్రమంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గల్లంతు అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు గల్లంతైన వ్యక్తి కోసం…
- కామారెడ్డిలో రైల్వే ట్రాక్ పక్కన కుళ్ళిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం.ఓ మహిళ కుళ్ళిపోయిన స్థితిలో విగతజీవిగా కనిపించిన ఘటన కామారెడ్డి పట్టణ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం పోతారం గ్రామానికి చెందిన నర్సాపురం శ్యామల భర్త రాజంతో కలిసి కామారెడ్డిలో కూలి పనికి వచ్చింది. అయితే రాజంకు…
- కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆవరణలో ధైర్యసాహసాన్ని చూపిన ఓ మహిళ.కామారెడ్డిలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆవరణలో ఓ మహిళ ధైర్యసాహసాన్ని చూపిన ఘటన చోటుచేసుకుంది. స్టేషన్లో ఒంటరిగా కూర్చున్న ఆమెపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేయడంతో,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 92164