Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News ఆ రెండు పార్టీలు మహనీయుల పేర్లను వాడుకున్నాయి…

ఆ రెండు పార్టీలు మహనీయుల పేర్లను వాడుకున్నాయి…

by Prakash
Bandi Sanjay

పి.వి నర్సింహారావు లాంటి గొప్ప వ్యక్తికి కేంద్రంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ భారత రత్న ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఎంపి బండి సంజయ్ అన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని మాజీ ప్రధాని, భారత రత్నపి.వి నర్సింహారావు నివాసానికి వెళ్లిన బండి సంజయ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పి.వి వల్లే కాంగ్రెస్ పార్టీకి ఇంకా మనుగడ ఉందని, కానీ పి.వి కి అంత్యక్రియలు కూడా జరపకుండా అవమానించడానికి కారణం ఇప్పటి వరకు తెలియడం లేదన్నారు. ఇప్పటి వరకు కూడా పి వి విషయంలో దుర్మార్గపు ఆలోచనలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. ఒక్క పి.వి విషయంలో మాత్రమే కాదు, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీరు అంతేనన్నారు. మొన్నటి దాకా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ది కూడా అదే ధోరణి అని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా మహనీయులను, వాళ్ళ పేర్లను వాడుకొని రాజకీయం చేయడం తప్ప.. వాళ్ళను గుర్తించి చేసింది ఏమి లేదని విమర్శించారు.

Advertisements

You may also like

Our Visitor

039471
Total views : 196988

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: