Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home TelanganaRangareddy ముచ్చర్ల శివారులో మహిళా దారుణహత్య

ముచ్చర్ల శివారులో మహిళా దారుణహత్య

by Rama
murder

రంగారెడ్డి జిల్లా ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముచ్చర్ల గ్రామ శివారులో మహిళా దారుణహత్య, ఆపై నిప్పటించిన వైనం -మంచాల మండలం జపాల గ్రామానికి చెందిన మంథని యాదమ్మ గా పోలీసులు గుర్తించారు. నిన్న యాదమ్మ తప్పిపోయిందని మంచాల పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మృతురాలు యాదమ్మ యాంజల్ విద్యుత్ శాఖ de ఆఫీస్ లో పనిచేస్తుంది. సంఘటన స్థలంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం యాదమ్మ భర్త విద్యుత్ శాఖ లో పనిచేస్తున్న సమయంలో అనుమాస్పదంగా మృతి చెందారు. విద్యుత్ ట్రాన్సఫార్మ్ on చేసే సమయంలో కావాలని విద్యుత్ On చేసి చంపేశారు అంటూ మృతురాలు కూతురు ఆవేదన వ్యక్తం చేసింది. యాదమ్మ భర్త మృతి పట్ల పలు రకాలుగా అనుమానాలు ఉన్నాయి.. మృతురాలి కూతురు విద్యుత్ శాఖ లొనే పనిచేస్తున్న ఓ వ్యక్తి పై అనుమానం వ్యక్తం చేసింది. మృతురాలు యాదమ్మ ని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు అంటూ బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మా నాన్న చంపిన వ్యక్తి మా అమ్మ ను చంపారు అని అనుమనం వ్యక్తం చేస్తున్న మృతురాలు కూతురు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisements

You may also like

Our Visitor

014620
Total views : 80614

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.