Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra PradeshNeloore నెల్లూరులో ప్రారంభం కానున్న బస్సు యాత్ర..

నెల్లూరులో ప్రారంభం కానున్న బస్సు యాత్ర..

by Rama
Bus Yatra

నెల్లూరు జిల్లాలో ఈరోజు సామాజిక సాధికారిక బస్సు యాత్ర ప్రారంభం కానుంది. కోవూరు నియోజకవర్గంలోని నార్త్ రాజపాలెంలో జరిగే బస్సు యాత్ర కోసం పెద్ద ఎత్తన జనసమీకరణ చేస్తున్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గం నుంచి సుమారు 15 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు. దీంతో రాజుపాలెం సెంటర్ మొత్తం వైఎస్సార్ సిపి ఫ్లెక్సీలతో నీలిమయమైంది. ఈ కార్యక్రమానికి మంత్రి కాకాణి, ఎంపీలు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, ఎమ్మెల్యేలు, మీడియా అడ్వయిజర్ సినీ నటుడు అలీ హాజరుకానున్నారు.

Advertisements

You may also like

Our Visitor

019290
Total views : 90222

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.