Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home TelanganaKhammam మిర్చి రైతుల ఆవేదన..

మిర్చి రైతుల ఆవేదన..

by Rama
Mirchi farmers

మార్కెట్ లో నేటి జెండాపాటకు కేవలం ముగ్గురు కొనుగోళ్లు దారులు వచ్చి మమా అనిపించి, రైతుల నోట్లో మట్టి కొట్టారని, జెండా పాట 21600 ఉండగా కొనుగోళ్లు మాత్రం కేవలం 14 నుంచి 16 లోపే చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మిర్చి క్వాలిటీ లో తేడా ఉంటే క్వింటాకు 500,1000 రూపాయలు ఉండొచ్చు కానీ, దారుణంగా 5000 నుంచి 6000 రూపాయలు తగ్గించి రైతు నోట్లో మట్టి కొడుతున్నారని అన్నారు. లైసెన్స్ ఉన్న ఖరీదు దారులు 168 మంది, అక్రమంగా ఖరీదు చేసే వ్యాపారులు 150 మంది ఉండగా నేటి జెండా పాటకు ముగ్గురు మాత్రమే ఎలా వస్తారని, ఖమ్మం మార్కెట్ దోపిడీ కి అడ్డాగా మారిందని ఆరోపిస్తున్నారు. రేపు ఎల్లుండి సెలవు కావడంతో దళారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై రైతు నడ్డి విరుస్తున్నారని అన్నారు. గిట్టుబాటు ధర జెండా పాట ప్రకారం ఇవ్వాలని, అప్పటి వరకు ఖాంటాలు నిలిపివేయాలని మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. విషయం తెలిసుకొని అక్కడకు వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్, అదనపు కలెక్టర్ లను రైతులు నిలదీశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: లాస్య కారును ఢీకొన్న టిప్పర్‌ను గుర్తించిన పోలీసులు..



చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే …
పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
22ఏపై బీజేపీ దీక్షలు.
భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: