Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh చింతా మోహన్ మీడియా సమావేశం…

చింతా మోహన్ మీడియా సమావేశం…

by Prakash
Former Union Minister of State Chinta Mohan

తిరుపతిలో మాజీ కేంద్ర సహాయ మంత్రి చింతా మోహన్ మీడియా సమావేశం ఏర్పాటుచేసారు. ముఖ్యమంత్రి కొన్ని పత్రికలు, ఛానళ్లనే చూడమని చెప్పడం దారుణమని, ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చింతా మోహన్ అన్నారు. కేంద్రంలో పెట్రో కెమికల్ మంత్రి గా పనిచేశా, భోపాల్ ఘటన బాధితులు ఇంకా ఉన్నారు. మూడేళ్ల క్రితం పాలిమర్స్ బాధితులు ఇబ్బంది పడుతున్నారని, ఆ పరిశ్రమను శ్రీ సిటీకి తరలించడం దారుణమని ఆయన అన్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తున్నామని, విష వాయువులు బయటకు వస్తే చాలా మంది ప్రాణాలు కొల్పేయే ప్రమాదం ఉందని ఎద్దేవా చేసారు. తనపై, పీవీ నరసింహారావు పై కూడా అనేక విమర్శలు చేశారని , మేము ఎంతో ఓపిక పట్టామని ఆయన తెలిపారు. గతంలో కొందరు ప్రముఖులు ఇలాంటి విమర్శలను హుందాగా తీసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వ్యవహారం మంచిది కాదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపిని సస్పెండ్ చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. జైపాల్ రెడ్డి బంధువు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈవీఎం లపై అనుమానం ఉందని, నగరం లో ఉంచాల్సిన వాటిని గ్రామీణ ప్రాంతంలో పెట్టారని, వాటిని ప్రజల మధ్య ఉంచాలని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాల్సిన ఎన్నికల జాబితా నగరపాలక సంస్థ లో ఉంచారని అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని రాత్రి వేళల్లో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆయన అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014334
Total views : 79946

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.