Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh అదే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం….

అదే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం….

by Prakash
Moolapet Port Works

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మూల పేట పోర్టు పనులను పరిశీలించిన మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మంత్రి తో పాటు టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ దువ్వాడ వాణి, జిల్లా కలెక్టర్ లాఠకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీదిరి అప్పలరాజు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15 న జిల్లా పర్యటన కు రానున్నారని అందులో భాగంగానే నేడు పోర్టు లో పనులు ఎలా జరుగుతున్నాయో, ఎంత వరకు జరిగాయో పరిశీలనకు వచ్చామన్నారు. గత 40 సంవత్సరాలుగా భావనపాడు పోర్ట్ అని వింటున్నామని, మూలపేట పోర్ట్ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి వల్లే సాకారం అయిందని అందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వలసలను నిర్మూలించడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. టిడిపి నాయకులు పోర్టు నిర్మాణ పనుల వద్దకు వచ్చి సందర్శించి సెల్ఫీ లు దిగాలని హేళన చేశారు. మార్చి నెలాఖరుకల్లా పోర్టు వద్దకు షిప్పుని తెచ్చే దిశగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనించాలని ప్రతిపక్షం నాయకుల మాటలు నమ్మవద్దని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తమ పార్టీ నే అధికారం లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: