Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Telangana నేడు ఢిల్లీలో AICC పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి

నేడు ఢిల్లీలో AICC పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి

by Rama
నేడు ఢిల్లీలో AICC పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈనెల 13 వరకూ రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆయన పర్యటించనున్నారు. ముందుగా రేపు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అనంతరం ఈనెల 12, 13 తేదీల్లో ఢిల్లీ పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు. రెండ్రోజులపాటు దేశ రాజధానిలో పర్యటించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులపై కేంద్ర మంత్రులకు వినతులు ఇవ్వనున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. సీఎంతోపాటు పలువురు మంత్రులూ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. క్యాబినెట్ విస్తరణపై ఆశావహులు ఇప్పటికే ఎదురు చూస్తుండగా.. ఈ అంశం కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈసారి స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రామాలయంలో అఖండ దీపం.
    700 ఏళ్లుగా అఖండంగా వెలుగుతున్న దీపం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న ఈ దీపాన్ని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. సీనియర్ సినీ నటులు, దర్శకుడు, న్యాయవాది సివిఎల్…
  • అమరావతిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.
    అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ.. అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన మంత్రి, అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.రాజధాని కోసం భూములు ఇచ్చిన ప్రతి రైతుకూ ప్లాట్లు…
  • మంత్రి నారాయణతో భేటీ అయిన సీఆర్‌ఆర్‌ఐ ప్రతినిధులు.
    మంత్రి నారాయణతో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో ఎల్పీఎస్ జోన్లు నిర్మిస్తున్న సీఆర్‌ఆర్‌ఐ రోడ్లను స్టడీ చేస్తున్నారు. రెండ్రోజులపాటు జోన్ల‌లో ఇంటర్నల్ రోడ్లు, డ్రెయిన్లు, ప‌వ‌ర్ లైన్లు అధ్యయనం చేశారు. ఎల్​పీఎస్ జోన్‌-2, 5, 9,…
  • మాజీ సీఎం జగన్ పై హోం మంత్రి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
    మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే.. జగన్ 9 నెలల తర్వాత విషప్రచారం మొదలుపెట్టారంటూ వ్యాఖ్యానించారు. గుడ్డ కాల్చి ముఖాన వేస్తే తుడుచుకునే…
  • జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్.
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన రచనను ఆ పోస్టులో షేర్ చేశారు. ఆ పోస్టులో.. ‘ ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో..ప్రాణాల్ని ఆటబంతుల్లా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

020058
Total views : 92161

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.