Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Telangana అధికారులతో సీఎం సమావేశం..

అధికారులతో సీఎం సమావేశం..

by Satya
CM's meeting with officers

ములుగు జిల్లా మండపేట మండలం కమలాపురం బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ -బిల్ట్ కంపెనీని పునరుద్దరించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ బిల్డ్ ప్రస్తుత నిర్వహణ సంస్థ ఫిన్ క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీతో చర్చలు జరిపారు. కర్మాగారంలోని పల్ప్ ఉత్పత్తిని మార్కెట్ లేదనే సాకుతో బిల్డ్ యజమాన్యం 2014 ఏప్రిల్ 4 నుంచి కంపెనీ షట్ డౌన్ చేసింది. దీంతో కంపెనీలో 750 మంది పర్మినెంట్ కార్మికులతో పాటు క్లరికల్, కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. దీంతో పదేళ్లుగా బిల్డ్ పునరుద్ధరణ చేసి ఉపాధి కల్పించాలని ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటాలు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం బిల్డ్ యాజమాన్యంతో చర్చలు జరిపి పారిశ్రామిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు. పిన్ క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐటిసి సంస్థలు బిల్ట్ ని తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014170
Total views : 79412

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.