279
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నారు ఆలయ అర్చకులకు, ట్రస్ట్ పాలకులకు మధ్య వివాదం చోటు చేసుకుంది. దేవస్థానంలో అర్చకత్వం చేసే ఒక అర్చకుడు ఆలస్యంగా విధులకు హాజరు అయ్యాడు. దీంతో దేవస్థానం చైర్మన్ ఆయనకు నోటీసులు ఇచ్చి బయటకు పంపివేశారు. దీంతో పూజారులు ఆగ్రహించి ఆలయ ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి దేవాలయం బయట బైఠాయించి వేదమంత్రాలతో ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని చైర్మన్, పూజరులతో మాట్లాడటంతో ఆందోళనను విరమించారు.





Total views : 92843