తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పతాకం తొలిసారి రెపరెపలాడింది. ఉద్యమ పార్టీ బీ ఆర్ ఎస్ ను ఓడించి అధికారంలోకి వచ్చింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి వంటి కీలక హామీల అమలుపై ప్రజలు పెదవి విరుస్తున్న సమయంలో హస్తం పార్టీ సరికొత్త వాగ్దానాలతో ప్రజల ముందుకు వచ్చింది. ఈ విషయంలో కర్ణాటకలో విజయవంతమైన ఫార్ములానే తెలంగాణలో పునరావృతం చేసింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఇచ్చిన ఆరు వాగ్దానాలను అమలు చేస్తామని ప్రజలను మెప్పించడంలో విజయం సాధించింది. మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ ను దాటి దూసుకుపోయింది. కాంగ్రెస్ ఇంతలా బలపడటానికి కారణం ఆ పార్టీ నాయకులంతా ఏకతాటిపైకి రావడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ అంటే పదవుల కోసం కాదు, ప్రజలకు మంచి పాలన అందించే పార్టీగా తీర్చిదిద్దాలని చేసిన ప్రయత్నాలు కర్ణాటకలో స్పష్టమయ్యాయి. రాజస్థాన్లో జరుగుతున్న పరిణామాలు కర్ణాటకలోనూ రిపీట్ అవుతాయని అంతా అనుకున్నారు. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. ఎన్నడూ లేనంతగా నాయకులు సైలెంట్గా వ్యవహరిస్తూ అధిష్ఠానం మాటకు కట్టుబడి ఉంటూ ఎన్నికల్లో పని చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ విపరీతంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేయడం, మేనిఫెస్టో హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సఫలీకృతమయ్యారు.
తొలిసారి తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పతాకం…
230
previous post






Total views : 90582