45
అన్నమయ్య జిల్లా పీలేరులో ఓ మైనర్ బాలిక చేసిన ఫిర్యాదు స్థానికంగా కలకలం రేపింది. అరబిక్ ట్యూషన్ నిర్వహిస్తున్న 50 ఏళ్ల వ్యక్తి ఒక బాలికను అసభ్యంగా తాకాడని బాలిక తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సంబంధిత వ్యక్తిని విచారణ నిమిత్తం స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సీఐ వెంకటేశ్వర్లు జోక్యంతో పరిస్థితి అదుపులోకి రాగా, పోలీసులు కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు.





Total views : 180026