76
పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ ఆంజనేయస్వామి ఆలయంలో విశేష ఘటన చోటుచేసుకుంది.భీమవరం మండలం వెంప గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు.హోమాలు కొనసాగుతున్న సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన ఓ వానరం నేరుగా ఆలయంలోకి ప్రవేశించింది. భక్తులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఎలాంటి ఆందోళనకు గురికాకుండా గర్భగుడి ముందు ప్రశాంతంగా కూర్చుని హోమాలు పూర్తయ్యే వరకు పూజా కార్యక్రమాలను తిలకించింది.ఈ దృశ్యాలను చూసిన భక్తులు భావోద్వేగానికి గురయ్యారు. ఆంజనేయస్వామి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక హోమాలకు స్వయంగా ఆంజనేయస్వామి విచ్చేశారంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.





Total views : 180026