328
రాష్ట్రంలో ఎన్నికల పరిణామాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మొదటి జాబితా సీట్ల ఎంపిక విషయంలో కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో రెండు పార్టీల అధినేతలు తీసుకునే నిర్ణయంపై అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటు టీడీపీ అటు జనసేన అభ్యర్థుల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బలంగా ఉండడంతో కచ్చితంగా అవకాశం మాకే వస్తుందని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పితాని బాలకృష్ణ, టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కచ్చితంగా తనకు అవకాశం కల్పిస్తారని జనసేన పిఎసి సభ్యుడు బాలకృష్ణ అంటున్నారు.




Total views : 147299