హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలవు రోజు కావడంతో సాయంకాలం చాలామంది నగరవాసులు బయటకు వచ్చారు. ఈ సమయంలో వర్షం కురవడంతో తడిసిముద్దయ్యారు. హైదరాబాద్లో ఈరోజు మరో గంటపాటు భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని నగరవాసులకు హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సూచించారు. నగర పరిధిలో రానున్న రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం. ఈరోజు సాయంత్రం అత్యధికంగా ఉస్మానియా యూనివర్శిటీ ప్రాంతంలో సుమారు 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, సనత్ నగర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, దోమలగూడ, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి, షాపూర్ నగర్, జీడీమెట్ల, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతి నగర్, ఖైరతాబాద్, నాంపల్లి, కోఠి, తిరుమలగిరి, ప్యాట్నీ, బేగంపేట, చిలకలగూడ, మారేడ్పల్లి, మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ, మలక్ పేట, చైతన్యపురి, ఎల్బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90629