60
నేటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ప్రారంభం కానుంది. తొలి విడతలో జూలై 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో పర్యటించి ఆ దేశ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.ఆ తర్వాత జూలై 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్న ప్రధాని.. వాణిజ్యం, రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు చర్చలు జరపనున్నారు.చివరి దశలో జూలై 10 నుంచి 11 వరకు న్యూజిలాండ్లో పర్యటించి.. ఇరు దేశాల మధ్య ఆర్థిక, విద్య, పెట్టుబడుల సంబంధాల బలోపేతంపై దృష్టి సారించనున్నారు.ఈ మూడు దేశాల పర్యటన ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.






Total views : 193807