అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం అగ్రరాజ్యంతో పాటు ప్రపంచ దేశాలను ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఈ ఘటనపై అమెరికా సీక్రెట్ సర్వీసెస్ దర్యాప్తు చేస్తుండగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి ముందే ట్రంప్పై హత్యాయత్నంలో ఇరాన్ ప్రమేయం ఉనట్లు యూఎస్ ఇంటలిజెన్స్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీకి రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఇంటల్ రిపోర్ట్తో అలర్ట్ అయిన సెక్యూరిటీ ఫోర్సెసెస్ ట్రంప్కు భద్రతాను కట్టుదిట్టం చేసింది.
ట్రంప్పై ఎటాక్ జరిగిన రోజు కూడా భద్రతా పెంచడంతోనే ఆయన ప్రాణప్రాయం నుండి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ట్రంప్పై కాల్పులు జరిపిన మాథ్యూ క్రూక్స్కు ఇరాన్తో పాటు ఇతర ఏ దేశంతో సంబంధం లేదని అమెరికా భద్రతా అధికారులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే, ట్రంప్పై హత్యాయత్నం వెనక ఉక్రెయిన్ ఉన్నట్లు కూడా వరల్డ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రష్యాతో భీకర యుద్ధం జరుగుతోన్న వేళ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధిస్తే తమకు అగ్రరాజ్యం మద్దతు కరువు అవుతోందని భావించి.. ట్రంప్ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- గద్దర్ విగ్రహానికి భూమిపూజ నిర్వహణ.పీడిత దళిత అణగారిన కులాలకు గద్దర్ మాట పాట ఒక దిక్సూచి అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ వెన్నెల గద్దర్ అన్నారు . మెదక్ జిల్లాలో పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు ధ్యాన్ చంద్ చౌరస్తా వద్ద గద్దర్ విగ్రహ…
- సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల…సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల… హృదయాలను హత్తుకునే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా భారీ అంచనాలు తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. తొలి ఫ్రేమ్ నుంచే ఆహ్లాదకరమైన, భావోద్వేగభరితమైన,…
- బీఆర్ఎస్పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు.తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్యను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో…
- చేనేతకు అండగా ప్రభుత్వం : హోంమంత్రి అనిత.జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ‘నేతన్న సేవలో’ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. చేనేత కార్మికుల నుంచి చీర కొనుగోలు చేసి వారి కష్టాన్ని అభినందించిన మంత్రి, చేనేత అనేది కేవలం వృత్తి మాత్రమే…
- ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ లేఖ.దేశంలో నదుల అనుసంధానంపై మరోసారి చర్చకు దారితీసే కీలక పరిణామం చోటుచేసుకుంది. గోదావరి–కావేరి–గుండార్ నదుల అనుసంధాన ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంతో వేగవంతంగా అమలు చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గోదావరిలో సముద్రంలో కలిసిపోతున్న…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి