అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం అగ్రరాజ్యంతో పాటు ప్రపంచ దేశాలను ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఈ ఘటనపై అమెరికా సీక్రెట్ సర్వీసెస్ దర్యాప్తు చేస్తుండగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి ముందే ట్రంప్పై హత్యాయత్నంలో ఇరాన్ ప్రమేయం ఉనట్లు యూఎస్ ఇంటలిజెన్స్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీకి రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఇంటల్ రిపోర్ట్తో అలర్ట్ అయిన సెక్యూరిటీ ఫోర్సెసెస్ ట్రంప్కు భద్రతాను కట్టుదిట్టం చేసింది.
ట్రంప్పై ఎటాక్ జరిగిన రోజు కూడా భద్రతా పెంచడంతోనే ఆయన ప్రాణప్రాయం నుండి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ట్రంప్పై కాల్పులు జరిపిన మాథ్యూ క్రూక్స్కు ఇరాన్తో పాటు ఇతర ఏ దేశంతో సంబంధం లేదని అమెరికా భద్రతా అధికారులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే, ట్రంప్పై హత్యాయత్నం వెనక ఉక్రెయిన్ ఉన్నట్లు కూడా వరల్డ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రష్యాతో భీకర యుద్ధం జరుగుతోన్న వేళ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధిస్తే తమకు అగ్రరాజ్యం మద్దతు కరువు అవుతోందని భావించి.. ట్రంప్ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90572