Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh ప్రజలకు వివరించడానికే… సాధికార బస్సు యాత్ర

ప్రజలకు వివరించడానికే… సాధికార బస్సు యాత్ర

by Prakash
Empowered bus trip

రైల్వే కోడూరు పట్టణంలో సాధికార బస్సు యాత్రను ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సర కాలంలో వైసిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికే ఈ సాధికార యాత్ర అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద ప్రజలకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందని ఆయన అన్నారు. ఈ సాధికార యాత్రలో ముఖ్య అతిథిగా ఎలక్ట్రానిక్ మీడియా అధికార ప్రతినిధి, సినీ నటుడు ఆలీ పాల్గొన్నారు. రైల్వే కోడూరు రాజ్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ దగ్గర నుండి టోల్గేట్ దగ్గర ఏర్పాటు చేసిన మహాసభ వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. అడుగడుగునా ఈ ర్యాలీలో ప్రజలు ఆలీకి బ్రహ్మరథం పడుతూనే నీరాజనాలు పలికారు. కేరళ వాయిద్యాలతో, భజన కోలాటాలతో, డీజే పాటలతో కోడూరు పట్టణం దద్దరిల్లిపోయింది. పలుచోట్ల ఆలీకి గజమాలలతో సత్కారం చేసారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: