గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ జనవరిలో హ్యాక్ అవగా రాజ్ భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్ ఖాతా హ్యాక్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ముంబై నుంచి గవర్నర్ ఖాతా హ్యాక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ముంబైలోని ఓ బొటిక్ వైఫైని దుండగుడు వినియోగించినట్లు తేల్చారు. బొటిక్ నిర్వాహకురాలిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. అయితే బొటిక్ షాప్ కొన్ని రోజులుగా మూసిఉన్నట్లు తెలిసింది.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గడువు ముగుస్తుండటంతో మరో 48 గంటల్లో సమ్మెకు వెళ్లేందుకు అన్ని డిపోల ఆర్టీసీ జేఏసీ నేతలు సన్నద్ధమయ్యారు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి…
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం వడగళ్లు కురిశాయి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో రాళ్ల వానపడింది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే, కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పాల్వంచ, దోమకొండ ప్రాంతాల్లో…
నేడు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించి పరిస్థితులను సమీక్షించనున్నారు. అనంతరం కాటారం మండలం నస్తూర్పల్లిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. 45…