వీడీ సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల లక్నో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. గత ఏడాది మహారాష్ట్రలో జరిగిన భారత్ జోడో యాత్రలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంథీ వీడీ సావర్కర్పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తరప్రదేశ్ కు చెందిన న్యాయవాది నృపేంద్ర పాండే పిటిషన్ దాఖలు చేశారు. సావర్కర్ను బ్రిటీష్ వారికి సహకరించిన వ్యక్తిగా రాహుల్ గాంధీ పేర్కొన్నారని, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని పాండే స్పష్టం చేశారు.
అంతేగాక మహాత్మా గాంధీ గతంలో సావర్కర్ను దేశభక్తుడిగా గుర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ముందుగా రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ను ఆశ్రయించగా.. ఈ పిటిషన్ ను ఏసీజేఎం అంబరీష్ కుమార్ శ్రీ వాస్తవ తోసిపుచ్చారు. దీంతో పాండే సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. ఈ ఫిర్యాదును విచారించిన లక్నో కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేస్తున్నట్లు తెలిపింది. భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ.. సావర్కర్ ఒక బ్రిటిష్ సేవకుడని, అతను పెన్షన్ పొందాడని, సమాజంలో ద్వేషాన్ని, దుష్ప్రవర్తనను వ్యాపింపజేశాడని ఆరోపించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావులఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల .ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 32 వేల 205 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తమ దృష్టిలో…
- శ్రీశైలం మల్లన్న దర్శనానికి కాలినడకన భక్తులునంద్యాల జిల్లా శ్రీశైల మల్లన్న దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు 40 కిలోమీటర్లు నల్లమల అడవుల్లో పాదయాత్ర చేస్తూ మల్లన్న దర్శనం కోసం వెళ్తున్నారు. Advertisements
- అసోంలో ప్రధాని మోదీ పర్యటనఅసోంలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. భారత ఎయిర్ఫోర్స్ విమానంలో వచ్చిన ప్రధాని..రోడ్డుపైనే ల్యాండ్ అయ్యారు. దిబ్రూఘర్ దగ్గర ప్రధాని మోదీ ప్రయాణించిన విమానం రోడ్డుపైనే ల్యాండ్ అయింది. అసోం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.…
- ఏపీ బడ్జెట్ ప్రతులకు ఆర్థిక మంత్రి పయ్యావుల పూజలుఏపీ బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్ధిక మంత్రి పయ్యవుల కేశవ్..తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారులు తో కలిసి పూజ నిర్వహించారు..బడ్జెట్ కాపీ ని తీసుకుని వెంకట పాలెం వెంకటేశ్వర స్వామి దేవాలయం లో పూజలు నిర్వహించారు..అక్కడ…
- టీటీడీ కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్రTTD నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టారు సీఎంవో ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర. ఏపీ ప్రభుత్వం ఆయన్ను TTD ఈవోగా నియమించడంతో నిన్న సాయంత్రమే తిరుమల చేరుకున్న రవిచంద్ర..ఉదయం వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి