పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అనుమతులు లేని అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కు పాదం మోపారు. పట్టణ శివారులోని బంధం పల్లి చెరువు వద్ద అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలతోపాటు అక్రమంగా వెలసిన లేఔట్ లేని వెంచర్ల హద్దురాళ్లను తొలగించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలమేరకు పెద్దపల్లి ఆర్డీఓ, ల్యాండ్ సర్వేర్, జిల్లా ఇరిగేషన్ అధికారులతో పాటు మున్సిపల్ శాఖ అధికారులు అనుమతిలేని కట్టడాల వివరాలు అందజేశారు. వాటి ఆధారంగా కొన్ని ఇళ్లతో పాటు.. వెంచర్ల హద్దురాళ్లను జేసీబీలతో తొలగించి నిర్మాణాలను కూల్చివేశారు. బంధంపల్లి చెరువును ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ గా గుర్తించి అందులో ఉన్న రెండు రేకుల షెడ్లు, అక్రమ వెంచర్ ను గుర్తించి అక్రమ వెంచర్ ప్రహరీ గోడను జేసీబీతో తొలిగించారు. త్వరలోనే పెద్దపల్లి, పరిసర గ్రామాల్లోని చెరువుల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేయబోతున్నట్లు ఆర్డీవో గంగయ్య తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90764