Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Latest News పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తల నియామకం..

పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తల నియామకం..

by Prakash
Parliament Election Coordinators

పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తలను భారత రాష్ట్ర సమితి నియమించింది. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీల సమన్వయకర్తలుగా మేడ్చల్ నుంచి ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మల్కాజిగిరి నుంచి మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్ నుంచి పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కుల వెంగళరావు, కూకట్ పల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే బేతి రెడ్డి సుభాష్ రెడ్డి, ఉప్పల్ నుంచి పార్టీ రాష్ట్ర సెక్రెటరీ జహంగీర్ పాష, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త లను నియమించారు.

అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీల సమన్వయకర్తలుగా మహేశ్వరం నుంచి శాసనమండలి మాజీ చైర్మన్ కనకమామిడి స్వామి గౌడ్, రాజేంద్రనగర్ నుంచి పార్టీ సీనియర్ నాయకులు పుట్టం పురుషోత్తం రావు, శేరిలింగంపల్లి నుంచి ఎమ్మెల్సీ కె నవీన్ కుమార్, చేవెళ్ల నుంచి పార్టీ సెక్రటరీ నాగేందర్ గౌడ్, పరిగి నుంచి పార్టీ సీనియర్ నాయకులు గట్టు రామచంద్రరావు, వికారాబాద్ నుంచి సీనియర్ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, తాండూర్ నుంచి జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్ నియమితులయ్యారు.

Advertisements

You may also like

Our Visitor

025661
Total views : 147641

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.