Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Latest News రాజేష్ రెడ్డి ఇంటింటి ప్రచారం..

రాజేష్ రెడ్డి ఇంటింటి ప్రచారం..

by Rama
rajesh reddy

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీలోని 24వ వార్డులో కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. పేదల కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ఎన్నికల తరుణంలో దగా చేసేందుకు మాయమాటలతో బిఅర్ఎస్ నాయకులు మళ్లీ వస్తున్నారని వారిని నమ్మవద్దని చెప్పారు. మోసపు మాటలతో వస్తున్న బిఅర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బుద్ధి చెప్పాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, పేదల కోసం అవిశ్రాంతంగా పనిచేసే కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని చెప్పారు. నన్ను గెలిపిస్తే నాగర్ కర్నూల్ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. మాయ మాటలు చెప్పి బిఅర్ఎస్ పార్టీని నమోవొద్దని గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు ఓటు వేసి ఆశీర్వదించాలని అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014073
Total views : 78907

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.