Saturday, May 9, 2026
News Navigation
Saturday, May 9, 2026
News Navigation

Breaking

Saturday, May 9, 2026
Home Latest News సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట..

సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట..

by Rama
Supreme Court

సుప్రీంకోర్టు (Supreme Court)లో కేంద్రానికి ఊరట లభించింది. కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికల కమిషనర్ల (Election Commissioner) నియామకం కోసం నూతనంగా తీసుకొచ్చిన చట్టాన్ని నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టు లో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. చట్టంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ దశలో నిలిపివేస్తే అది తీవ్ర గందరగోళానికి దారితీస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సందర్భంగా ఇటీవల ఈసీలుగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఐఏఎస్‌ అధికారులు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్బీర్‌ సింగ్‌ నియామకాలను కూడా ధర్మాసనం ప్రస్తావించింది. కొత్తగా నియమితులైన వారిపై ఎలాంటి ఆరోపణలు లేవని పేర్కొంది. ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ. అది పాలనాయంత్రాంగం కింద పనిచేస్తుందని చెప్పకూడదు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఈసీల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం తప్పు అని భావించలేమన్నారు. ఈ సమయంలో సమతుల్యత పాటించాల్సిన అవసరం చాలా ముఖ్యం అని ధర్మాసనం అభిప్రాయపడింది. 2023 చట్టం రూపొందించక ముందు ఎన్నికల కమిషనర్ల నియామక తాత్కాలిక కమిటీలో ప్రధాని, సీజేఐ, లోక్‌సభలో విపక్షనేత సభ్యులుగా ఉన్నారు. కొత్త చట్టం ప్రకారం ఏర్పడిన కమిటీలో సీజేఐ స్థానంలో కేంద్రమంత్రికి చోటు కల్పించారు. దీన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై కేంద్రం బుధవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. కొత్త చట్టంలో సీజేఐకు చోటు కల్పించకపోవడాన్ని సమర్థించుకుంది. కమిటీలో న్యాయ సభ్యుడు ఉంటేనే ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్న వాదన సరికాదని న్యాయస్థానం తెలిపింది.

ఇది చదవండి: మరల టీడీపీ గూటికి చేరిన వైసీపీ నాయకులు..


తమిళనాడులో మరో బిగ్ ట్విస్ట్..
తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. సీఎం అభ్యర్థిగా సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు …
విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి సందిగ్ధత..
విజయ్ సీఎంగా పట్టాభిషేకంపై మరోసారి సందిగ్ధత నెలకొంది. ఇవాళ ఉదయం జరగాల్సిన ప్రమాణ స్వీకార వేడుకపై …
పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి ……..
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే …

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

010941
Total views : 70908

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.