అడిగేవాడు, చెప్పేవాడు లేకపోవడంతో కొందరు ఆర్టీసీ డ్రైవర్ లు ఇష్టారాజ్యంగా బస్సులను నడుపుతుంటారు. రెడ్ సిగ్నల్ పడి ఉన్నా బస్సును నడుపుతారు. ప్రయాణికుల ప్రాణాలను గాలికి వదిలి, తమ సంస్థకు సంబంధించిన బస్సులతో పోటీపడుతూ వేగంగా రోడ్లపై దూసుకుపోతారు. ఇదేంటని అడిగితే అడిగినవారిపై బూతులతో దాడి చేస్తారు. హైదరాబాద్ లాంటి నగరాలలో ఇరవై సెకన్లకు మించి బస్ స్టాప్ లో బస్సును ఆపరు. వృద్ధులు, వికలాంగులకు ఇబ్బంది అయ్యేది కూడా పట్టించుకోరు. రాత్రుళ్లు చెప్పాల్సిన అవసరమే లేదు పది గంటల తర్వాత బస్సులను బస్ స్టాప్ లో ఆపరు. ప్రయాణికులు రోడ్డు మీదకు వచ్చి బస్సులను ఆపాల్సిన పరిస్థితి ఉంటుంది. మంచిర్యాలలోని వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. చౌరస్తా వద్ద రెండు ద్విచక్ర వాహనలను మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.. పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, బాధితులను ఆసుపత్రికి తరలించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90599