Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Main News మంచిర్యాలలోని వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం

మంచిర్యాలలోని వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం

by Rama
మంచిర్యాలలోని వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం

అడిగేవాడు, చెప్పేవాడు లేకపోవడంతో కొందరు ఆర్టీసీ డ్రైవర్ లు ఇష్టారాజ్యంగా బస్సులను నడుపుతుంటారు. రెడ్ సిగ్నల్ పడి ఉన్నా బస్సును నడుపుతారు. ప్రయాణికుల ప్రాణాలను గాలికి వదిలి, తమ సంస్థకు సంబంధించిన బస్సులతో పోటీపడుతూ వేగంగా రోడ్లపై దూసుకుపోతారు. ఇదేంటని అడిగితే అడిగినవారిపై బూతులతో దాడి చేస్తారు. హైదరాబాద్ లాంటి నగరాలలో ఇరవై సెకన్లకు మించి బస్ స్టాప్ లో బస్సును ఆపరు. వృద్ధులు, వికలాంగులకు ఇబ్బంది అయ్యేది కూడా పట్టించుకోరు. రాత్రుళ్లు చెప్పాల్సిన అవసరమే లేదు పది గంటల తర్వాత బస్సులను బస్ స్టాప్ లో ఆపరు. ప్రయాణికులు రోడ్డు మీదకు వచ్చి బస్సులను ఆపాల్సిన పరిస్థితి ఉంటుంది. మంచిర్యాలలోని వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. చౌరస్తా వద్ద రెండు ద్విచక్ర వాహనలను మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.. పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, బాధితులను ఆసుపత్రికి తరలించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
    తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
  • ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
    తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
  • హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
    హైదరాబాద్‌ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్‌ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ…
  • వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.
    ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
  • స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.
    స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: