అమరావతిని అణగదొక్కి ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించిన వైసీపీకి ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి (Sujana Chowdary) పిలుపునిచ్చారు. సోమవారం 38 డివిజన్ లో సుజనా ప్రచారం చేశారు. 38వ డివిజన్ టీడీపీ అధ్యక్షురాలు పితాని పద్మ, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు తమ్మిన లీలా కరుణాకర్, జనసేన డివిజన్ అధ్యక్షుడు నాళం ఠాకూర్ తో కలిసి పున్నమిఘాట్ , విద్యాధరపురం, కుమ్మరిపాలెం, కొట్టేటి కోటయ్య వీధి, నాలుగు స్తంభాల సెంటర్ తదితర ప్రాంతాల్లో సుజనా పర్యటించారు. సుజనాకు స్థానికులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఎన్నికల్లో వైసీపీకి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని సుజనా పిలుపునిచ్చారు. అయిదేళ్ళ వైసీపీ పాలనలో మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి విజయవాడ పశ్చిమ నియోజవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా వైసీపీ కొత్త మేనిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితం అని సుజనా అభివర్ణించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
యువతకు ఉద్యోగాలు లేవు పట్టుమని పది పరిశ్రమలు రాలేదు కల్తీ లిక్కర్ తో ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలన్నారు. నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటానని వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షిస్తామని హజ్ హౌస్ నిర్మాణాలను చేపట్టి అభివృద్ధికి సహకరిస్తామని వివరించారు ఎన్డీ హయాంలో దేశంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కూటమితోనే అభివృద్ధి మరింత సాధ్యమన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీ-టీడీపీ- జనసేన కూటమిగా ఏర్పడ్డాయని ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి ఎం ఎస్ బేగ్ , టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, గొల్లపూడి మాజీ సర్పంచ్ బొమ్మసాని సుబ్బారావు, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, మాజీ కార్పొరేటర్లు అబ్దుల్ ఖాదర్, కరిముల్లా, టీడీపీ డివిజన్ మాజీ అధ్యక్షులు సురభి బాలు సుజనాకు మద్దతుగా నిలిచారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…