Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra PradeshVishakapattanam శోభయమానంగా స్వామివారి స్వర్ణపుష్పార్చన

శోభయమానంగా స్వామివారి స్వర్ణపుష్పార్చన

by Rama
Svarnapushparchana

ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో శోభాయ మానంగా స్వర్ణపుష్పార్చన జరిపించినట్లు ఈవో శ్రీనివాసమూర్తి తెలియజేశారు. ఉదయం స్వామివారికి స్వర్ణపుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణపుష్పార్చన అత్యంత వైభవంగా, సింహాచల పుణ్య క్షేత్రములో దేవస్థాన వేదపండితుల వేదమంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణపుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువ జామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపములో వేదికపై అధీష్టింపజేసి వేద మంత్రాలు నాధ స్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి వారి స్వర్ణపుష్పార్చన, సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామి వారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు.

Advertisements

You may also like

Our Visitor

013856
Total views : 78198

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.